కోవిడ్ విలయానికి టాలీవుడ్ ఎఫెక్ట్ అవుతోంది. ఇప్పటికే కొందరు సినీ స్టార్స్ సెల్ఫ్ ఐసొలేషన్ కి వెళ్లారు. రీసెంట్ గా హీరోయిన్ పూజా హెగ్డే కరోనా పాజిటివ్ కు గురయ్యారు. ఈరోజు రచయిత, దర్శకుడు ఎన్. సాయి బాలాజీ ప్రసాద్ కోవిడ్ తో మృతి చెందారు. ఎన్. వర ప్రసాద్ గా ఆయన సుపరిచితుడు. కరోనా బారిన పడి గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుఝామున మృతి చెందారు.
రియల్ స్టార్ శ్రీహరి నటించిన శివాజీ, ఒరేయ్ తమ్ముడూ సినిమాలకు దర్శకత్వం వహించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారూ.. బాగున్నారా సినిమాకు స్క్రీన్ ప్లే సమూర్చిన వరిలో వర ప్రసాద్ కూడా ఉన్నారు. సినిమాలతోపాటు.. సిరి, అపరంజి, హాలాహలం సీరియల్స్ కు దర్శకత్వం వహించారు. ఆయన స్వస్థలం తిరుపతి. వరప్రసాద్ కు భార్య గౌరి, కుమార్తె స్నేహ పూజిత ఉన్నారు. ఆయన స్వస్థలం తిరుపతి. రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖలో పని చేశారు.
723709 444820We will supply deal reviews, deal coaching, and follow up to ensure you win the deals you cant afford to shed. 8232