ఇకపై టోకెన్లు లేకుండానే నేరుగా శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి అన్నారు. క్యూలైన్లలో టోకెన్ల కోసం జరిగిన గందరగోళ పరిస్థితులపు ఆయన స్పందించారు. ‘పరిస్థితి తీవ్రత తెలిసి అరగంటలోనే సమస్యను పరిష్కరించాం. 15వేల టోకెన్ల వరకూ ఇబ్బంది లేదు.. 10గంటల సమయంలో మాత్రం ఇబ్బంది తలెత్తింది. అధికారులు సమాచారమివ్వగానే టోకెన్లు నిలిపివేసి కేవలం అరగంటలోనే భక్తులను వైకుంఠం-2 కాంప్లెక్సు ద్వారా దర్శనం చేయించాలని ఆదేశించాం. ముందస్తు ఏర్పాట్లు చేయకుండానే ఇంత వేగంగా స్పందించేవాళ్లమా..? భగవంతుడికి భక్తులను దూరం చేస్తున్నామనే ప్రచారం సరికాదు.
సర్వదర్శన టైమ్ స్లాట్ టోకెన్లను తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో ఇస్తున్నాం. ఇక్కడే సమస్యలు వస్తున్నాయి. మూడు ప్రదేశాల్లో 20వేల మంది ఉన్నారు. లైన్ల నుంచి వచ్చే సమయంలో బయటకు రాలేక గాయాలయ్యాయి. దీనికి సొమ్మసిల్లి పడిపోయారని దుష్ప్రచారం చేయడం దారుణం. పాత పద్ధతిలో సర్వదర్శనానికి అనుమతిస్తే.. 20నుంచి40 గంటలు ఇబ్బంది పడాలి. భక్తులకు మరింత మేలు చేయాలనే ఈ వ్యవస్థను పటిష్టం చేశాం’ అని అన్నారు.
85392 63807This web page is often a walk-through for all with the details it suited you with this and didnt know who to ask. Glimpse here, and youll surely discover it. 247028
906296 271048Just a smiling visitor here to share the enjoy (:, btw outstanding layout. 369547
645698 648709What could you suggest in regards to your post that you just made some days in the past? Any positive? 267417