తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కి పెద్ద షాక్ తగిలింది. గత కొంతకాలంగా ఆయన పౌరసత్వానికి సంబంధించిన వివాదం ఎదుర్కొంటున్నారు. 2009 నుంచే ఆయనపై వివాదం నడుస్తోంది. ఆయన జర్మనీలో ప్రొఫెసర్గా విధులు నిర్వహించడం.. ఈ క్రమంలో ఆయనకు ద్వంద్వ పౌరసత్వం వుండడంతో, ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడంటూ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ న్యాయ పోరాటం చేస్తున్నారు.
2018 ఎన్నికల్లో చెన్నమనేని రమేష్ వేములవాడ ఎమ్మెల్యేగా ఇంకోసారి విజయం సాధించిన విషయం విదితమే. కాగా, చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై స్పష్టతనివ్వాలని కేంద్ర హోంశాఖను హైకోర్టు ఆశ్రయించడంతో కేంద్ర హోంశాఖ, చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు ప్రకటించింది. వాస్తవాలు దాచి తప్పుడు మార్గాలలో భారత పౌరసత్వం పొందారని కేంద్ర హోంశాఖ స్పష్టతనిచ్చింది ఈ నేపథ్యంలో న్యాయస్థానంలోనూ చెన్నమనేని రమేష్కి షాక్ తప్పేలా లేదు.
మొత్తమ్మీద, హోం శాఖ స్పష్టతనివ్వడంతో చెన్నమనేని రమేష్ ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అనర్హుడని తేలబోతోంది. ఇది నిజంగానే తెలంగాణ రాష్ట్ర సమితికి పెద్ద ఎదురు దెబ్బలా చెప్పుకోవచ్చు. పౌరసత్వ వివాదం నడుస్తున్నప్పటికీ, చెన్నమనేని రమేష్కి టిక్కెట్ని టీఆర్ఎస్ ఎలా ఇచ్చిందన్న విషయమై ఇప్పుడు చాలా పెద్ద రచ్చ నడుస్తోంది.
145713 977617very good post. Neer knew this, thankyou for letting me know. 377514
23633 921952Do you have a spam problem on this site; I also am a blogger, and I was wondering your situation; we have developed some nice practices and we are looking to swap techniques with other folks, please shoot me an e-mail if interested. 261687
588052 356277You created some 1st rate factors there. I seemed on the internet for the difficulty and located most people will go along with together with your web site. 949815