కరోనా మహమ్మారి కారణంగా ఈసారి దీపావళి సందడి లేకుండా పోయింది. దీపావళి టపాసులు కాల్చడం వల్ల వెలువడే వాయుకాలుష్యానికి కరోనా తోడైతే ప్రజలకు మరింత ప్రమాదకరమని ఇప్పటికే పలు రాష్ట్రాలు బాణసంచా కాల్చడాన్ని నిషేధించాయి. తాజాగా ఆ జాబితాలోకి తెలంగాణ కూడా వచ్చింది. దీపావళి సందర్భంగా టపాసులు కాల్చకుండా నిషేధం విధించాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టంచేసింది.
దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు టపాసులు పేల్చకుండా చూసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తన వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు ఇంకా ఉన్నాయని, ఈ సమయలో టపాసులు కాల్చడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని నివేదించారు.
టపాసుల వాయుకాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు తలెత్తడమే కాకుండా కరోనా వైరస్ త్వరగా వ్యాపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టపాసులు కాల్చడం మంచిది కాదని అభిప్రాయపడింది. వెంటనే టపాసులను నిషేధించాలని, ఇప్పటికే తెరిచి ఉన్న షాపులను మూసివేయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాజస్థాన్ హైకోర్టు సైతం టపాసులను నిషేధించిన విషయాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ టపాసుల క్రయ విక్రయాలను నిషేధించాలని సూచించింది. టపాసులు అమ్మడం లేదా కొనడం వంటివి చేయొద్దని స్పష్టంచేసింది. ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ప్రసార మాధ్యమాల ద్వారా ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొంది.
453137 650818I always was concerned in this topic and stock nonetheless am, regards for posting . 445205
740767 997082hello!,I really like your writing very much! 312936