ఏపీ పంచాయతీ ఎన్నికల్లో చివరిదైన నాలుగో దశలో టీడీపీకి ఉరటనిచ్చే ఫలితం వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామంలో టీడీపీకి విజయం లభించింది. నారావారిపల్లిలో టీడీపీ మద్దతుదారు లక్ష్మి విజయం సాధించారు. తన సమీప అభ్యర్థిపై 563 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో టీడీపీ నేతలు ఆనందంలో మునిగిపోయారు.
ఇప్పటికే చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది వైసీపీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్వగ్రామంపైనా దృష్టి సారించింది. అయితే.. ఇక్కడ టీడీపీ మద్దతుదారుకే విజయం దక్కింది. వైసీపీ ప్రలోభాలకు గ్రామ ప్రజలు తలొగ్గలేదని నారావారిపల్లె టీడీపీ క్యాడర్ అంటోంది.
683564 694421Hey there, I feel your blog may well be having browser compatibility issues. When I appear at your web site in Safari, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, superb weblog! 598485