జూన్ 11న వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో టిడిపి హయాంలో జరిగిన రంజాన్ తోఫా,ఫైబర్ నెట్,చంద్రన్న కానుక,హెరిటేజ్ సరకుల సరఫరా అవకతవకలపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సమర్పించిందని, దీనిపై సీబీఐ దర్యాప్తు జరపనుంది ఇది వరకే తెలిపాం.
అది జరిగిన 24 గంటల్లోనే ఏపీలో పలు చోట్ల అరెస్టుల పర్వం మొదలైంది. ఈఎస్ఐ కుంభకోణంలో భాగంగా నేటి ఉదయం 7 గంటల 20 నిమిషాలకి శ్రీకాకుళం నిమ్మాడలోని తన నివాసంలో ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేయగా, సీబీఐ అదుపులోకి తీసుకుంది.
టిడిపి హయాంలో ఈఎస్ఐ కుంభకోణం జరిగిందని, ఈఎస్ఐ కోసం జరిగిన కొనుగోళ్లలో రూ.900 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ప్రకారం అచ్చెన్నాయుడు ప్రధాన ఆరోపణులు ఎదుర్కొంటున్నారు. అప్పటి కార్మిక మంత్రి అయినా అచ్చెన్నాయుడు చొరవతోనే అప్పటి డైరెక్టర్లు 900 కోట్లకు కొన్న మందుల్లో 100 కోట్లు తప్పుడు లెక్కలు చూపారని, అలాగే ప్రభుత్వం మందుల కొనుగోలుకు 293 కోట్లు కేటాయిస్తే వీళ్ళు మాత్రం 698 కోట్లు చూపించి ప్రభుత్వ ఖజానాకు 404 కోట్లు నష్టం కలిగించారని నివేదికలో ఉంది.
మరోవైపు వైఎస్ జగన్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని, జీవోల్ల్లో ప్రతిదీ క్లియర్ గా ఉందని, కావాలనే ఇలా అరెస్టులకు పాల్పడుతున్నారని, అతి ముఖ్యంగా ఈఎస్ఐ కి సంబందించిన ప్రతి విషయం కేంద్ర ఆధీనంలో ఉంటుందని, వాళ్ళ అనుమతులతో అన్ని కరెక్ట్ గా జరిగాయని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.
869792 88735It is hard to locate knowledgeable individuals on this subject, but you sound like you know what youre talking about! Thanks 84156
934866 711135This write-up gives the light in which we can observe the reality. This really is extremely good one and gives in-depth info. Thanks for this nice article. 239308
56691 288300Hey, you used to write great, but the last couple of posts have been kinda boringK I miss your super writings. Past several posts are just a little bit out of track! come on! 184430
627854 223739I genuinely prize your function , Fantastic post. 480733