‘సైరా నరసింహారెడ్డి’ టీమ్ మీడియా ముందుకొచ్చింది. సినిమాకి ఘనవిజయాన్ని కట్టబెట్టిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పింది. దేశంలోని పలు నగరాల్లో ‘సైరా నరసింహారెడ్డి’ కోసం ప్రచారం చేయాల్సి రావడంతో, తెలుగు మీడియాకి పూర్తిస్థాయిలో అందుబాటులో వుండలేకపోయామంటూ మెగాస్టార్ చిరంజీవి అసలు విషయం చెప్పేశారు.
అయితే, వీలైనంతవరకు తెలుగు మీడియాకి టీమ్ ఇంటర్వ్యూలు ఇచ్చిందన్న విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. చరణ్ సైతం, తమను సపోర్ట్ చేసిన మీడియాకి థ్యాంక్స్ చెప్పాడు. మరోపక్క ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ‘సైరా నరసింహారెడ్డి’ తొలి రోజు వసూళ్ళ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
‘సినిమా తొలి రోజు 85 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. బాలీవుడ్లో గ్రాస్ గురించే మాట్లాడుకుంటారు. మనం షేర్ గురించి మాట్లాడుతుంటాం. వసూళ్ళ సంగతి పక్కన పెడితే, చరణ్ తన తండ్రికి చాలా మంచి బహుమతి ఇచ్చాడు. సినిమా గురించి అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు.
ఓ నిర్మాతగా నాకు సినిమా నిర్మాణమెంతటి కష్టమో తెలుసు. చరణ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో అర్థం చేసుకోగలను. సినిమాని వ్యాపారంలా కాకుండా, ప్యాషన్తో నిర్మించిన చరణ్కి హేట్సాఫ్. వసూళ్ళు పోటెత్తుతున్నాయ్. డౌట్ లేదు. అంతకంటే మిన్నగా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, మెచ్చుకుంటున్నారు..’ అంటూ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో సంచలనంగా మారాయి.
అయితే, ‘సైరా’ తెలుగులో తొలి రోజు బాగానే వసూలు చేసినా, బాలీవుడ్లో మాత్రం అనుకున్న స్థాయిలో అక్కడ వసూళ్ళను సొంతం చేసుకోలేకపోయింది. ‘వార్’ సినిమా ప్రభావం ‘సైరా’ మీద చాలా గట్టిగా పడింది.
505496 218877Hey I was just seeking at your internet site in Firefox and the image at the top with the link cant show up appropriately. Just thought I would let you know. 565362