జనసేన ఎంపీ అభ్యర్థి , నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీ.వై.రెడ్డి (69) మంగళవారం రాత్రి హైదరాబాద్ కేర్ ఆసుపత్రి లో తుది శ్వాస విడిచారు. గత కొద్దీ రోజులుగా ఆయన గుండె , కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఎస్పీ.వై.రెడ్డి గారి మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలియజేశారు .
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎస్పీ.వై.రెడ్డి మృతి పై ద్రిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ‘నంద్యాల లోక్సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్న ఎస్పీవై రెడ్డిగారి మరణం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా తరపున, జనసైనికుల తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో హుందాతనం పాటించిన నాయకుడు ఎస్పీవై రెడ్డి గారు, విద్యావంతుడు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్న ఆయన పారిశ్రామికవేత్తగా ఎన్నో విజయాలు సాధించడం, సామాజికసేవలో నిమగ్నమైన తీరు, కరువు ప్రాంతాల్లో ప్రజలకు అందించిన చేయూత ఎన్నదగినవి. శ్రీ ఎస్పీవై రెడ్డిగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ ప్రకటన విడుదల చేశారు.
శ్రీ ఎస్.పి.వై.రెడ్డి గారి మరణం బాధాకరం – JanaSena Chief @PawanKalyan pic.twitter.com/eHvD2b8Ym3
— JanaSena Party (@JanaSenaParty) April 30, 2019
తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్పీ.వై.రెడ్డి గారి మృతి పట్ల సంతాపం తెలుపుతూ ట్వీట్ చేసారు. ‘ నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అనారోగ్యంతో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.
నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అనారోగ్యంతో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.
— N Chandrababu Naidu (@ncbn) April 30, 2019
నంద్యాల ఎంపీ ఎస్పీ.వై.రెడ్డి గారి మృతి పట్ల వైయస్సార్సీపి అధినేత వై యస్ జగన్మోహన్ రెడ్డి గారు సంతాపం తెలిపారు .ఎస్పీ.వై.రెడ్డి గారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు
YSR Congress President Sri YS Jagan Mohan Reddy expressed his grief over the demise of Nandyala MP SPY Reddy and conveyed his condolences to the bereaved family members.
— YSR Congress Party (@YSRCParty) May 1, 2019