కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై సానుకూలంగా వడివడిగా అడుగులేస్తోందట.. ఇదంతా తమ ఘనతేనట. అధికార వైసీపీ చేసుకున్న ప్రచారమిది. కేంద్ర హోం శాఖ, రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కమిటీ భేటీకి సంబంధించి ఎజెండా అంశాల్ని ఖరారు చేస్తే, అందులో ప్రత్యేక హోదా అంశం కూడా వుండడంతోనే ఈ రచ్చ.
అయినా, ప్రత్యేక హోదా అంశం రెండు రాష్ట్రాల మధ్య చర్చతో పరిష్కారమవుతుందా.? ప్రత్యేక హోదా అంశంతో తెలంగాణకి ఏంటి సంబంధం.? ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్రం, తీసుకోవాల్సింది రాష్ట్రం. సో, ఎజెండా ప్రిపరేషన్ సందర్భంగా సాంకేతిక లోపమేదో దొర్లి వుండాలి. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రం పదే పదే స్పష్టం చేశాక, ఆ ప్రత్యేక హోదా అంశాన్ని ఏ రూపంలో అయినా కేంద్రం ఎందుకు ప్రస్తావిస్తుంది.? ఛాన్సే లేదు.
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అంతలోనే సీన్ మారింది. కేంద్ర హోం శాఖ తన తప్పుని తెలుసుకుంది, ఎజెండా అంశాల్ని సవరించింది. ఇంకేముంది.? కొత్త వివాదం షురూ అయ్యింది. బీజేపీలోని ఒకప్పటి టీడీపీ నేతలు ఈ మొత్తం కుట్రకు కారణమనీ, ఎజెండాలోని అంశాల్ని తొలగించేందుకు చంద్రబాబే కుట్ర పన్నారనీ, తన మనుషులతో ఆ పని సజావుగా చేసేశారనీ వైసీపీ ఆరోపిస్తోంది.
నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టు తయారైంది వైసీపీ తీరు. ఈ విషయంలో నిందించాల్సి వస్తే తొలుత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాని నిందించాలి. ప్రధాని నరేంద్ర మోడీని నిందించాలి. కానీ, అంత ధైర్యం వైసీపీలో ఎవరికీ లేదు. చంద్రబాబుని విమర్శిస్తే ప్రత్యేక హోదా వస్తుందా.? చంద్రబాబు ఆపితే ప్రత్యేక హోదా ఆగుతుందా.?
చంద్రబాబు ఖేల్ ఖతం అయిపోయింది 2019 ఎన్నికల్లోనే. ఇప్పుడాయనకు జాకీలు వేసి, ఆయనకు లేని సమర్థతను వైసీపీ ఆపాదించి, జనం మీద బలవంతంగా తన బులుగు పైత్యాన్ని రుద్ధడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?
915033 691196I like this website extremely significantly so a lot excellent info. 707701
719081 957884Thank you for your information and respond to you. auto loans westvirginia 565765
748049 736953The Case For HIIT Cardio – Why You must Concider it By the way you may want to check out this cool internet site I found 476199