Switch to English

సతీష్‌ వేగేశ్న.. మరో మంచి చిత్రం కోసం ప్రయాణం !

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సతీష్ వేగేశ్న రచయితగా తెలుగు సినీ పరిశ్రమకు సుపరిచితమైనా, దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులు అందరికీ దగ్గర అయ్యింది శతమానం భవతి చిత్రంతో. 2017 సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలతో పోటీగా, చిన్న సినిమా ‘శతమానంభవతి’ కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ రెండు పెద్ద సినిమాలూ (గౌతమి పుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్‌ 150) సంచలన విజయాల్ని అందుకోవడంతో, ఆ విజయాల నడుమ ‘శతమానం భవతి’ ఎవరికీ కనిపించదని చాలామంది సినీ జనాలే అభిప్రాయపడ్డారు. అయితే సినిమాలో ‘విషయం’ వుండాలేగానీ, తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరించి తీరతారన్న నమ్మకం విడిచిపెట్టలేదు ‘శతమానంభవతి’ టీమ్‌. చివరికి ‘శతమానం భవతి’ టీమ్‌ నమ్మకమే గెలిచింది. రెండు పెద్ద విజయాల నడుమ, ‘శతమానంభవతి’ మంచి సినిమాగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.

అసలు ‘శతమానం భవతి’ సినిమాలో ఏమున్నాయి.? అని చూస్తే, చాలానే కన్పిస్తాయి. నటీ నటుల చక్కటి నటనా ప్రతిభ, మంచి సంగీతం, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, వీటన్నిటికీ మించి ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకునే డైలాగ్‌లు, స్క్రీన్‌ పైనుంచి తల తిప్పుకోనివ్వని గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే.. ఇవన్నీ ‘శతమానం భవతి’ సినిమాలో వున్నాయి. కుటుంబ ‘విలువల’ గురించి దర్శకుడు ఎంతో బాధ్యతగా చెప్పిన ‘పాయింట్‌’ అన్ని వయసుల ప్రేక్షకులకీ, మాస్‌ – క్లాస్‌ సెంటర్స్‌ ఆడియన్స్‌కీ బాగా అర్థమయ్యింది. అదే ‘శతమానం భవతి’ సినిమా విజయానికి కారణం.

ఈ సినిమా తర్వాత దర్శకుడు సతీష్‌ వేగేశ్న ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాని రూపొందించాడు. ఇందులోనూ తన ట్రేడ్ మార్క్ కుటుంబ విలువల్ని చాల హృద్యంగా చూపించాడు. అయితే ఒక వర్గానికి మాత్రమే ఆ చిత్రం నచ్చడంతో, అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది శ్రీనివాస కళ్యాణం. ఇప్పుడు ‘శ్రీనివాస కళ్యాణం’ తర్వాత మరో మంచి కథ కోసం ఈ దర్శకుడు ఒకింత గ్యాప్‌ తీసుకున్నట్లు కన్పిస్తోంది.

స్వతహాగా గోదావరి అందాల్ని ఇష్టపడే సతీష్‌ వేగేశ్న, ప్రస్తుతం అక్కడే తదుపరి చేయబోయే చిత్రాల కోసం అద్భుతమైన కథల్ని సిద్ధం చేసే పనిలో బిజీగా వున్నారట. అతి త్వరలోనే సతీష్‌ వేగేశ్న నుంచి ఓ మంచి సినిమాని చూడబోతున్నామన్నది నిస్సందేహం.

గతంలో సతీష్‌ వేగేశ్న, పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేశారు. రాజా, కబడ్డీ కబడ్డీ, నా ఆటోగ్రాఫ్‌, గబ్బర్‌ సింగ్‌, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ వంటి సినిమాలకు పనిచేసి, ఆయా చిత్రాలు ఘనవిజయం సాధించడంలో తనవంతు పాత్ర పోషించారు. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా గబ్బర్‌ సింగ్‌ సినిమాకే కాదు, సాయిధరమ్‌ తేజ్‌కి తొలి సూపర్‌ హిట్‌ సినిమా అయిన ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’ సినిమాకీ సతీష్‌ వేగేశ్న స్క్రీన్‌ ప్లే అందించడం గమనార్హం. ముప్పలనేని శివ, ఈవీవీ సత్యనారాయణ వంటి మేటి దర్శకుల వద్ద గతంలో పనిచేశారాయన. సీనియర్‌ దర్శకులతో ఆ అనుభవం, దాంతోపాటుగా యువ దర్శకులతో పనిచేసిన కొత్త అనుభవం వెరసి, సతీష్‌ వేగేశ్న సినిమాల్లో పాత – కొత్త కలయిక అత్యద్భుతంగా కనిపిస్తుంటుంది.

‘శతమానం భవతి’ సినిమాతో లెక్కలేనన్ని ప్రశంసలు, లెక్కకు మిక్కిలిగా అవార్డులు అందుకున్న సతీష్‌ వేగేశ్న.. జాతీయ అవార్డుల్లోనూ తనదైన ముద్ర వేసిన విషయం విదితమే. 27 సంవత్సరాల తర్వాత ఒక తెలుగు చిత్రం స్వర్ణకమలం అందుకోవడం ‘శతమానం భవతి’కే దక్కింది. అలాగే ఇక్కడ అయిదు నంది అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ అలాంటి మంచి కథతో, ‌ ఓ మంచి విజయంతో వేగేశ్న సతీష్ మళ్ళీ మన ముందుకు వస్తారని ఆశిద్దాం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...