విశాఖలో వరుసగా రెండు రోజుల వ్యవధిలో జరిగిన కిడ్నాప్ లు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ ఉదంతం మరువక ముందే ఫైనాన్స్ వ్యాపారి కిడ్నాప్ కు గురి కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు బాధితుడు చెప్తున్నదానికి జరిగిన ఘటనకు పొంతన లేకపోవటంతో లోతైన విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
స్థానిక పోర్టు ఆస్పత్రి వద్ద కైలాసపురం క్వార్టర్స్ లో నివాసం ఉండే లాలం అప్పలరాజు ఫైనాన్స్ వ్యాపారి. ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పెట్రోల్ బంక్ వద్ద మొన్న సాయంత్రం కిడ్నాప్ కు గురయ్యాడు. ముగ్గరు వ్యక్తులు ఆయన్ను ఆటోలో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారు. సాగర్ నగర్ వైపు తీసుకెళ్లి అప్పలరాజు చేతికి ఉన్న బంగారు ఉంగరాలు, గొలుసు, లక్ష 25వేలు లాక్కున్నారు. అప్పలరాజు పొట్టపై, చేతిపై గాయపరచి పక్కనే ఉన్న పొదల్లో తోసేశారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
నిందితులు తనను బలవంతంగా తీసుకెళ్లారని చెప్తున్న అప్పలరాజు మాటలకు సీసీ టీవీ ఫుటేజీకి సంబంధం గుర్తించారు పోలీసులు. అప్పలరాజే ఆటో పిలుచుకుని ఎక్కి వెళ్లినట్టు ఉంది. దీంతో పోలీసులు ఈ కిడ్నాప్ పై దృష్టి సారించారు. ఫైనాన్స్ వ్యాపారంలో గానీ.. శత్రువులు ఎవరైనా ఉన్నారా అనే కోణంపై విచారణ చేపట్టారు. అప్పలరాజు పలువురు రాజకీయ నాయకులతో కూడా సన్నిహితంగా ఉంటాడని బంధువులు చెప్తున్నారు. ఆ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.
685283 1032941 can undertake all sorts of advised excursions with assorted limousine functions. Various offer excellent courses and a lot of can take clients for just about any ride your bike more than the investment banking region, or even for a vacation to new york. ??????? 112300