Switch to English

వైఎస్‌ జగన్‌కి షాక్‌: సజ్జలపై గవర్నర్‌కి నిమ్మగడ్డ ఫిర్యాదు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని సలహాదారు పదవి నుంచి తొలగించాలంటూ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ లేఖ రాశారు. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌నైన తనపై పరుష పదజాలంతో సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారంటూ గవర్నర్‌కి రాసిన లేఖలో నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు.

 

సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు, వైసీపీకి చెందిన ముఖ్య నేత విజయసాయిరెడ్డిపైనా, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణపైనా గవర్నర్‌కి ఎస్‌ఈసీ ఫిర్యాదు చేయడం గమనార్హం. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ, టీడీపీ అధినేత చంద్రబాబుకి బంట్రోతు.. అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తోన్న విషయం విదితమే. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వానికి అస్సలేమాత్రం ఇష్టం లేదు. అధికార పార్టీ, ఈ ఎన్నికల్ని అడ్డుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ఎస్‌ఈసీపై తీవ్రస్థాయిలో బురదల్లుతూ వచ్చారు వైసీపీ నేతలు. ఉద్యోగ సంఘాల నేతల్ని సైతం ఎస్‌ఈసీపైకి అధికార పార్టీ ముఖ్య నేతలు, ప్రభుత్వ పెద్దలు ఉసిగొల్పిన విషయం విదితమే.

 

ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా సంయమనం పాటించిన నిమ్మగడ్డ, ఎన్నికలకోడ్‌ అమల్లోకి వచ్చినప్పటినుంచి తనకున్న విశేషాధికారాల్ని వినియోగించడం షురూ చేశారు. కాగా, ఐఏఎస్‌ అదికారి ప్రవీణ్‌ ప్రకాష్‌ని ఎన్నికల విధుల నుంచి తప్పించాలంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ, రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌ని ఆదేశించడం మరో ఆసక్తికరమైన అంశం. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించేందుకు ఎస్‌ఈసీ ప్రయత్నించగా, ప్రభుత్వ పెద్దల సూచనలతో ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆ ప్రయత్నాలకు గండికొట్టారు. ఎస్‌ఈసీతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించకుండా అధికారుల్ని అడ్డుకున్నట్లు ప్రవీణ్‌ ప్రకాష్‌పై ఆరోపణలున్నాయి.

 

మొత్తమ్మీద, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కీ, రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య గ్యాప్‌ ఇంకా ఇంకా పెరుగుతూనే వుందన్నమాట. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన దరిమిలా, ఎస్‌ఈసీకి వున్న విశేషాధికారాల నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. సజ్జలకు పదవీ గండం పొంచి వుందన్న ప్రచారం ఓ వైపు జరుగుతుండగా, ఇంకోపక్క వైసీపీ మద్దతుదారులు సోషల్‌ మీడియా వేదికగా ఎస్‌ఈసీపై అత్యంత జుగుప్సాకరమైన పదజాలంతో విరుచుకుపడుతుండడం గమనార్హం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...