గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan)హీరోగా బుచ్చిబాబు సాన( దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. ‘RC16’ గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైపోయింది. ఇందులో చెర్రీ సరసన ఎవరు నటిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ( Rasha Thadani) నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తర్వాత కీర్తి సురేష్( Keerthy Suresh)పేరు కూడా వినిపించింది.
ఇప్పుడు స్టార్ హీరోయిన్ సాయి పల్లవి( Sai Pallavi)ని ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మూవీ టీం ఆమెని సంప్రదించి చర్చలు కూడా జరిపారట. ఈ ప్రాజెక్టుకి ఆమె ఓకే చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. విలన్ గా విజయ్ సేతుపతి ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వీటిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ ఈ వార్తలు విన్న ఫ్యాన్స్ మాత్రం ఖుషీ అవుతున్నారు.
‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. ఏ.ఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.