వైసీపీ లో వెన్నుపోటు రాజకీయాలు ఎక్కువైపోయాయని సంచలనం రేపారు ఎమ్మెల్యే రోజా. వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్న నాయకులు కొంతమంది బయట మాత్రం తాము పార్టీకి వీరవిధేయులుగా నటిస్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా పని చేస్తూ పార్టీ రక్తం తమలో ప్రవహిస్తుందంటూ నటించడం ఆశ్యర్యం కలిగిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. నగరిలో ఓటు హక్కు వినియోగించుకున్న రోజా మీడియాతో మాట్లాడారు.
రోజా వ్యాఖ్యలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించే చేశారంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి రెబెల్స్ బెడద ఎక్కువైందన్నారు. వైసీపీ ముసుగులో ఉంటూ పార్టీ అభ్యర్థులను ఓడించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తానని ఆమె పేర్కొన్నారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకుని సార్వత్రిక ఎన్నికల్లో మాదిరే వైసీపీకి ఘన విజయం అందించాలని ఆమె కోరారు. సీఎం జగన్ ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారని ఈ సందర్భంగా రోజా అన్నారు.
374831 746750I genuinely treasure your work , Wonderful post. 456204
842877 983972An incredibly interesting examine, I may not agree completely, but you do make some very legitimate factors. 973883
539652 657644Somebody necessarily assist to make seriously articles I may state. That is the extremely 1st time I frequented your internet page and to this point? I surprised with the research you produced to make this actual put up amazing. Amazing task! 874700