గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ వరద, బురదల్లా కలిసి పని చేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల కోసం రెండు పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సరైన నాయకత్వాన్ని తయారు చేసుకోలేని స్థితిలో ఉన్న బీజేపీ ఎన్నికల్లో పోటీ కోసం ఆరాటపడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. కొందరు నేతల తీరు సంక్రాంతి గంగిరెద్దుల్లా ఉందని ఎద్దేవా చేశారు.
ఓవైపు జనసేనతో పొత్తు లేదని బండి సంజయ్ చెప్తే.. ఆయనకు తెలీకుండా కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కలసి వెళ్లి పవన్ మద్దతు ఎలా కోరారు? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై తనతోసహా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ధర్మపురి అరవింద్ అనేక విషయాలపై ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోలేదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ను ప్రశ్నించారు. ఇప్పుడొచ్చి కేసీఆర్ పై చార్జిషీట్ విడుదల చేస్తున్నామని ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
మూసీ నది ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని కోరితే పట్టించుకోలేదు. సరైన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేవారు. శ్రీశైలం, కల్వకుర్తి ప్రాజెక్టుల అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదు. హుస్సేన్ సాగర్ పరిధిలో సచివాలయం నిర్మాణం అక్రమమని మీకు ఫిర్యాదు చేసినా ఆనాడు స్పందించలేదు. హుస్సేన్ సాగర్ చుట్టూ నిర్మాణాలొద్దని కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి.
మైహోమ్ సిమెంట్ కు పర్యావరణ అనుమతులు లేవని ఫిర్యాదు చేసినా స్పందించని ప్రకాశ్ జవదేకర్ ఇప్పుడు ఎన్నికల సమయంలో హడావిడి చేయడం ఏంటని ప్రశ్నించారు. నేను వేస్తున్న ఈ చార్జిషీట్ కు ప్రకాశ్ జవదేకర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
95062 466678hello I was really impressed with the setup you used with this blog. I use blogs my self so congrats. definatly adding to favorites. 217760
517819 251357Yours is really a prime example of informative writing. I believe my students could learn a great deal from your writing style and your content material. I might share this article with them. 99527