ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువగా లభించే ఎర్రచందనాన్ని సంక్లిష్ట వాణిజ్యం ప్రక్రియ సమీక్ష నుంచి తొలగించినట్లు కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు. ఎర్రచందనం అత్యంత వేగంగా అంతరించిపోయే వృక్షజాతుల జాబితాలో ఉన్నందున 2004 నుంచి ‘రివ్యూ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ట్రేడ్ ప్రాసెస్’ కింద పరిగణించేవారు. ప్రస్తుతం ఆ నిబంధనని తొలగించి రైతులకు ప్రోత్సాహం అందించనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఈనెల 6 నుంచి 10 వరకు స్విట్జర్లాండ్ లోని జెనీవా వేదికగా జరిగిన కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పైసెస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫౌనా( CITES) స్థాయి సంఘం సమావేశంలో ఎర్రచందనం పై ఉన్న నిషేధాన్ని తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీంతో ఇకపై రైతులు ఎర్రచందనాన్ని పండించి ఎగుమతి చేసుకునే వీలు ఉంటుంది.
ఇప్పటికే ఎర్రచందనాన్ని పండించేందుకు అనుమతి ఉన్నప్పటికీ దాన్ని ఎగుమతి చేసేందుకు పరిమితులు ఉన్నందున రైతులు దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రస్తుత నిర్ణయంతో విరివిగా సాగు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ పంట కి అనుమతులు ఇవ్వడంలో అటవీశాఖ కీలకంగా మారనుంది