రకుల్ ప్రీత్ సింగ్ అవ్వడానికి నార్త్ హీరోయిన్ అయినా కూడా సౌత్ లో ఆమెకు వచ్చినంత గుర్తింపు మరో చోట రాలేదు. మరీ ముఖ్యంగా తెలుగులో ఆమె బడా సినిమాల్లో కనిపించింది. అయితే 2021లో వచ్చిన కొండపొలం తర్వాత మళ్ళీ తెలుగులో సినిమా చేయలేదు. ఇక తమిళ్ లో అయితే ఆమె ఆఖరు చిత్రం 2019లో విడుదలైంది.
బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టడానికి సౌత్ లో కెరీర్ ను పాజ్ చేసింది రకుల్. అయితే ఆమె బాలీవుడ్ కలలు కొంచెం కూడా నెరవేరలేదు. ఆమె నటించిన సినిమాలు వరసగా ఏడు దారుణంగా పరాజయం పాలయ్యాయి. హిందీలో చేసిన ఎటాక్, రన్ వే 34, కట్ పుట్లీ, డాక్టర్ జి, థాంక్ గాడ్, ఐ లవ్ యు, ఛత్రివాలి చిత్రాలు దెబ్బతినేసాయి.
దీంతో ఇప్పుడు మళ్ళీ సౌత్ పై దృష్టి పెట్టింది. ముందుగా తమిళ్ లో శివకార్తికేయన్ సరసన చిత్రం చేస్తోంది. అయలాన్ (ఎలియన్) ఈ ఏడాదే విడుదల కానుంది.