డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రమే కాదు, అతి వేగంగా అత్యంత నిర్లక్ష్యంగా కారు నడిపి, ఆ కారు ప్రమాదానికి కారణమయ్యాడంటూ సినీ నటుడు రాజ్తరుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారన్న ప్రచారం తెరపైకొచ్చింది. పోలీసులు రాజ్ తరుణ్ని అరెస్ట్ చేశారనీ, స్టేషన్ బెయిల్పై విడుదల చేశారన్నది ఆ ప్రచారం తాలూకు సారాంశం.
అయితే, రాజ్ తరుణ్ మద్యం సేవించాడనడానికి సరైన ఆధారాలు ఏమీ లేవని పోలీసు అధికారులే స్వయంగా చెబుతున్నారు. దానికి తోడు, ఘటన జరిగిన సమయంలో రాజ్ తరుణ్ణి ప్రత్యక్షంగా ఆ కారులో వుండగా ఎవరూ చూసినట్లు సమాచారం తమకు లేదని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.
ఇదిలా వుంటే, రాజ్ తరుణ్ ఈ రోజు పోలీసుల యెదుట విచారణకు హాజరయ్యాడు. పోలీసులు రాజ్ తరుణ్ ముందు కొన్ని ప్రశ్నలు వుంచగా, వాటికి ఆయన సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. మరోసారి రాజ్ తరుణ్ని పోలీసులు విచారించే అవకాశాలున్నాయి. ఇదిలా వుంటే, కార్తీక్ అనే వ్యక్తి ఒకరు రాజ్తరుణ్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మీడియాకెక్కిన విషయం విదితమే. ఆ ఘటనను తాను స్వయంగా చూశాననీ, అందుకు తగ్గ వీడియోలు తన వద్దనున్నాయని ఇప్పటికే ఆ వీడియోల్ని మీడియాకి అందించాడు కార్తీక్.
అయితే, అందులో రాజ్తరుణ్ యాక్సిడెంట్కి పాల్పడ్డట్లు ఆధారాలేమీ లేవు. కాగా, ఆ వీడియోల్ని చూపి, రాజ్తరుణ్ని బ్లాక్మెయిల్ చేశాడంటూ కార్తీక్పై రాజ్తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది. మొత్తమ్మీద, రాజ్తరుణ్ కారుకి ప్రమాదం జరిగిన మాట వాస్తవమే అయినా, ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
ప్రస్తుతానికైతే ఈ కేసులో రాజ్ తరుణ్ ఇరుక్కుపోయే అవకాశాలు పెద్దగా లేనట్లే భావించాలేమో. ఘటన జరిగిన వెంటనే రాజ్ తరుణ్కి వైద్య పరీక్షలు నిర్వహించి వుంటే ప్రయోజనం వుండేదనీ, ఇప్పుడు ఆయన మధ్యం సేవించారనడానికి ఆధారాలు దొరికే అవకాశం లేదని పోలీసులు తేల్చేశారు.
276994 787391I appreciated than you might be now. 917015
60423 100776Some really intriguing information , effectively written and loosely user genial . 262934