ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా అయన ఫాన్స్ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోవానుకున్నారు .. కానీ ప్రస్తుతానికి ప్రభాస్ హైద్రాబాద్ లో లేకపోవడంతో ఫాన్స్ కాస్త నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లండన్ లో ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజా సినిమా జాన్ కోసం లండన్ వెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తానికి బాహుబలి తో ఇంటర్నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్ తన 40 వ పుట్టిన రోజును ఈ రోజు అయన స్నేహితులతో కలిసి లండన్ లోనే ఈ వేడుకలు చేసుకుంటున్నాడు.
భారీ అంచనాల మధ్య వచ్చిన సాహో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోవడంతో డిస్సప్పాయింట్ అయిన ప్రభాస్ నెక్స్ట్ సినిమా జాన్ విషయంలో కాస్త ఆలోచనలో పడ్డాడు. అందుకే స్క్రిప్ట్ విషయంలో మరోసారి చెక్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ని లండన్ లోనే ప్లాన్ చేసారు. ఇందులో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
మరో వైపు ప్రభాస్ తో సినిమా చేయడానికి గీత గోవిందం ఫేమ్ పరశురామ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నాడట. విజయ్ దేవరకొండ తో పరశురామ్ చేసిన గీత గోవిందం సంచలన విజయం తరువాత ఇంతవరకు ఈ దర్శకుడు నెక్స్ట్ సినిమా ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ఇప్పటికే పలువురు హీరోలతో చర్చలు జరిపినా కూడా వర్కవుట్ కాలేదు. అందుకే ఆయన ప్రభాస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరి ప్రభాస్ ఈ దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
912926 322254Its a shame you dont have a donate button! Id without a doubt donate to this brilliant blog! I suppose for now ill settle for book-marking and adding your RSS feed to my Google account. I look forward to fresh updates and will share this weblog with my Facebook group. Chat soon! 756504