ఏపీలో మరో పరువు హత్య జరిగింది. తమ కుమార్తెను వివాహం చేసుకున్న దళితుడిని నడి రోడ్డు మీద రాయితో మోది దారుణంగా హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లా ఆదోనీలో జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఈరన్న, లక్ష్మిల కుమార్తె మహేశ్వరి. 2020 నవంబర్ లో మహేశ్వరికి నిశ్చితార్థం చేశారు. నిశ్చితార్థం తర్వాత నంద్యాలలో బ్యాంక్ కోచింగ్ కోసం వెళ్తానంటూ చెప్పి ప్రేమించిన ఆడమ్ స్మిత్ తో హైదరాబాద్ వెళ్లిపోయింది.
హైదరాబాద్ లో ఆర్య సమాజ్ లో మహేశ్వరి మరియు ఆడమ్ స్మిత్ లు వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం తమ సొంత ప్రాంతంకు వెళ్లారు. కర్నూలు జిల్లా పోలీసులను రక్షణ కోరడం జరిగింది. పెళ్లి చేసుకుంటే చేసుకున్నారు కాని మా మూందుకు రావద్దంటూ మహేశ్వరి తండ్రి పదే పదే వార్నింగ్ ఇచ్చాడు.
అయినా కూడా వారు రావడంతో పరవు పోయిందని భావపడ్డ ఈరన్న ఎలాగైనా ఆడమ్ స్మిత్ ను చంపేయాలని భావించాడు. పెళ్లి అయినా కొన్ని వారాలకే కూతురు భర్తను దారుణంగా కొట్టి చంపేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈరన్నను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
293562 99442Its outstanding as your other articles : D, regards for posting . 936292
461618 347523oh nicely, Alicia silverstone is matured nowadays but when she was nonetheless younger, she may be the sex symbol of hollywood` 434961