Switch to English

పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయాలు మార్పుకు సంకేతాలు: పవన్ కల్యాణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

రాష్ట్రంలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో జనసేన 23 శాతం ఓటింగ్ సాధించిందని అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో, అరకు వంటి ఏజెన్సీ ప్రాంతంలో పంచాయతీలను జనసేన కైవసం చేసుకోవడం విశేషమన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం ములగాంపల్లి పంచాయతీని 24 ఏళ్ల యువకుడు జనసేన మద్దతుతో గెలవడం సంతోషంగా ఉందన్నారు. మొత్తంగా 270 పంచాయితీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు దక్కితే.. 1654 స్థానాల్లో జనసేన రెండో స్థానంలో నిలిచిందని అన్నారు.

 

పెడన నియోజకవర్గంలోని నీలిపూడి పంచాయతీలో స్థానిక ఎమ్మెల్యే హెచ్చరికలు ఖాతరు చేయకుండా ప్రజలు జనసేన మద్దతిచ్చిన అభ్యర్ధిని గెలిపించారని అన్నారు. ఇక్కడ పంచాయతీ మొత్తాన్ని జనసేన క్లీన్ స్వీప్ చేయడం విప్లవానికి సంకేతమని అన్నారు. మచిలీపట్నం నియోజకవర్గం నేలకుర్రు పంచాయతీ సర్పంచి విజయాన్ని రీకౌంటింగ్ పేరుతో అడ్డుకోవాలని చూస్తే జనసైనికులు, స్థానికులు ఐక్య పోరాటం చేయడం హర్షణీయమన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని వేకనూరు, పల్నాడులోని తక్కెళ్లపాడుతోపాటు రాయలసీమలోని కొన్ని సున్నితమైన ప్రాంతాలను జనసేన మద్దతుదారులు గెలుపొందడం ఆనందించే విషయమన్నారు.

 

రాజాంపేట నియోజకవర్గంలోని వీరబల్లి, అవనిగడ్డ ప్రాంతంలోని రామచంద్రాపురం పంచాయతీల్లో జనసేన మద్దతుదారులు గెలవడం సంతోషించే విషయం. పంచాయతీ ఎన్నికలంటే కాకలు తీరిన యోధులు ఉంటారు. కానీ.. నేడు నూనుగు మీసాల యువకులు కూడా విజయం సాధించడం ప్రజల్లో వస్తున్న మార్పుకు సంకేతాలు. మహిళలు సాధించిన విజయం కూడా వ్యవస్థల్లో మహిళలకు పెరుగుతున్న ప్రాధాన్యానికి నిదర్శనాలు. ఈ సందర్భంగా జనసేన గెలుపుకు యువతీ యువకులు, మహిళలు చూపిన తెగువ, పోరాటాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని ఆయన అన్నారు.

 

2008లో నేను స్థాపించిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు ప్రతిరూపమే జనసేన అని అన్నారు. కులాలు, మతాలకు అతీతంగా ఆశయాలు, భావజాలం ఉన్న వ్యక్తులందరూ వ్యవస్థలోకి రావాలని ప్రారంభించిన నాటి సంకల్పం ఈరోజు కనిపిస్తోందన్నారు. జనసేనకు వస్తున్న మద్దతు మార్పుకు సంకేతమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...