పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీపుల్ ప్రాజెక్ట్స్ తో యమ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. వకీల్ సాబ్ ద్వారా విజయం అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలు భీమ్లా నాయక్, హరిహర వీర మల్లు షూటింగ్ దశలో ఉన్నాయి. భీమ్లా నాయక్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుండగా ఏప్రిల్ లో హరిహర వీర మల్లు విడుదలవుతుంది.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరో సినిమాను కూడా మొదలుపెట్టబోతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ సినిమా చేయనున్నాడు. దీనికి సంబంధించిన ప్రకటన ఇదివరకే వచ్చింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, నిర్మాతలు మరోసారి భేటీ అయ్యారు.
అతి త్వరలోనే పవన్ – హరీష్ శంకర్ సినిమా షూటింగ్ మొదలుకానుందని అధికారికంగా వెల్లడైంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తాడు.
938301 99086Some truly good stuff on this internet website , I like it. 627666
632471 254934I was trying to find this. Truly refreshing take on the data. Thanks a whole lot. 116585
442203 244719stays on topic and states valid points. Thank you. 48681