ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. సర్వేలు తెరపైకి వచ్చేస్తాయి. ఫలానా పార్టీకి ఇన్ని సీట్లు.. ఫలానా పార్టీదే అధికారం అంటూ బోలెడు ఊహాగానాలు హల్ చల్ చేస్తుంటాయి. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనూ పలు సర్వేలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన సర్వేలను ఓసారి పరిశీలిస్తే.. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ కి సమీపంలో ఆగిపోతుందని ఎక్కువ సర్వేలు వెల్లడించాయి. అదే సమయంలో కాంగ్రెస్ పరిస్థితి కూడా ఏమీ బాగోలేదని విశ్లేషించాయి. మొత్తమ్మీద ఎన్డీఏనే మరోసారి గద్దెనెక్కే అవకాశం ఉందని తేల్చాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీదే విజయం అంటూ ఎక్కువ సర్వేలు వెల్లడించాయి. ఆ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని ఎక్కువ మంది ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నాయి. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఈ భావన అధికంగా ఉందని తెలిపాయి. ఆశ్చర్యకరంగా అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఒక్క సర్వే కూడా రాలేదు. రెండు రోజుల క్రితం ఏపీలో టీడీపీదే అధికారం అంటూ ఓ పత్రికలో వచ్చిన వార్త పూర్తి అవాస్తమని తేలింది.
ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సర్వేలు హోరెత్తాయి. అయితే, అక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిదే అధికారం అంటూ పలు సర్వేలు తమ అంచనాలు వెల్లడించాయి. ఆంధ్రా ఆక్టోపస్ గా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే కూడా మహాకూటమికే అధికారం అని తేల్చింది. ఒక్క సర్వే తప్ప మిగిలిన సర్వేలన్నీ మహాకూటమికే అధికారం అని పేర్కొనగా.. ఫలితాలు మాత్రం వీటికి విరుద్ధంగా వచ్చాయి.
ఈ నేపథ్యంలో అసలు ఈ సర్వేల్లో శాస్త్రీయత ఎంత? వాటిలో విశ్వసనీయత ఏ మేరకు ఉంటుంది? అనే సందేహాలు తలెత్తుతాయి. దాదాపుగా లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ఓటర్లు ఉండే నియోజకవర్గంలో పదుల సంఖ్యలో జనాల అభిప్రాయాలను మాత్రమే క్రోడీకరించి వెల్లడించే ఫలితాలు ఎంతవరకు నిజమవుతాయనే సందేహం రాక మానదు. సర్వేకి తీసుకునే శాంపిల్ సైజ్ తో పాటు ఎన్ని నియోజకవర్గాల్లో, ఏయే వయసులవారిని ప్రాతిపదికగా తీసుకుని అధ్యయనం నిర్వహించారనే అంశాలపైనే ఆయా సర్వేల శాస్త్రీయత ఆధారపడి ఉంటుంది.
ఎక్కువ నియోజకవర్గాల్లో, భారీ సంఖ్యలో శాంపిల్ తీసుకుని, అత్యంత శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిన సర్వే ఫలితాలు మాత్రమే వాస్తవ ఫలితాలకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది. సర్వే శాంపిల్ పెరిగే కొద్దీ ఫలితాల అంచనాల్లో కచ్చితత్వం కూడా పెరుగుతుంది. నిజానికి ఓటరు ఏ పార్టీకి ఓటు వేయాలో ఎన్నికలకు ముందుగానే నిర్ణయం తీసుకుంటాడని, అనంతరం అతడు ప్రభావితమయ్యే స్థాయిలో ఏవైనా నిర్ణయాలు జరిగితే మినహా అతడి ఆలోచనలో మార్పు రాదనేది అంచనా.
ప్రస్తుత పరిస్థితుల్లో జననాడి పట్టుకోవడం అంత సులభం కాదు. జనాల్లో చైతన్యం బాగా పెరిగింది. కేవలం పత్రికల మీదే ఆధారపడి ఉన్న రోజుల్లో అవి ఏది చెబితే అదే నిజమని నమ్మేవారు. కానీ ప్రస్తుతం ప్రపంచం మారింది. సోషల్ మీడియా హవా పెరిగింది. ఫలితంగా జనాలకు వాస్తవ విషయాలు బోధపడుతున్నాయి. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సర్వేలకు కూడా వారి నాడి పూర్తిగా అందడంలేదు. రాజకీయ పార్టీలు కూడా సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని సంబరపడి ఆదమరచి కూర్చుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
304849 85121Hello I found the No cost Simple Shopping Icons Download | Style, Tech and Internet post very interesting therefore Ive included our track-back for it on my own webpage, continue the fantastic job:) 190902
382910 255280As a result youll need ultra powerful online enterprise concepts to keep operating in finding into matters proper your incredible web-based function. MLM 215154
800988 383490Right after I initially commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now each time a remark is added I get four emails with exactly the same comment. Is there any method youll be able to take away me from that service? Thanks! 339376