Switch to English

కాలేజీల్లో ‘సున్నా’ కరోనా: లోకల్‌ పోల్స్‌పై భయమిందుకేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

మీకు తెలుసా.? ఆంధ్రప్రదేశ్‌లోని కళాశాలల్లో కరోనా ‘జీరో’ అట. స్కూళ్ళకు హాజరవుతున్న విద్యార్థుల విషయాన్ని తీసుకున్నా, నమోదయిన కరోనా పాజిటివిటీ చాలా చాలా తక్కువట. టీచర్లకూ చాలా తక్కువగానే కరోనా సోకిందట. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా వ్యవహరించడం వల్లే కరోనా, అదుపులోకి వచ్చిందట. ఇంకెందుకు ఆలస్యం.? స్థానిక ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కి రాష్ట్రంలోని వైఎస్‌ జగన్‌ సహకరిస్తే సరి.! కానీ, ఆ ఒక్కటీ అడక్కూడదు.

స్థానిక ఎన్నికలంటేనే అధికార పార్టీకి వెన్నులో వణుకు బయల్దేరుతోంది. ‘అమ్మో, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఇంకేమన్నా వుందా.? కరోనా సెకెండ్‌ వేవ్‌ వచ్చే ప్రమాదం వుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికలు నిర్వహించకూడదు..’ అంటున్నారు మంత్రులు. ఏది నిజం.? ఏది అబద్ధం.? స్కూళ్ళు, ఇతర విద్యా సంస్థలు తెరిచాక కూడా కరోనా అదుపులోనే వుందని ప్రభుత్వం చెబుతున్న మాటలు నిజమైతే, స్థానిక ఎన్నికలకు కరోనా అడ్డంకి లేదు.

ఒకవేళ సెకెండ్‌ వేవ్‌ వచ్చే అవకాశాలు వున్నాయని ప్రభుత్వం చెబుతున్నది నిజమే అయితే, విద్యా సంస్థలు – కళాశాలలకు సంబంధించి కరోనాపై ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాలు తప్పు. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది అధికార పార్టీ తీరు.. స్థానిక ఎన్నికల విషయంలో.

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా వుండగానే, రాష్ట్రంలో అడ్డగోలుగా ఏకగ్రీవాలు జరిగాయి. విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీ నేతలు అరాచకాలకు తెరలేపారు. మరిప్పుడెందుకు వైసీపీ భయపడుతున్నట్లు.? గతం తాలూకు ‘ఆనవాళ్ళు’ బయటపడిపోతాయనా.? లేకపోతే, గతంలో సాగిన తమ ఆటలు ఇప్పుడు సాగవనా.? ఎక్కడో వ్యవహారం గట్టిగానే తేడా కొడుతోంది.

స్థానిక ఎన్నికలంటే ఎప్పుడూ అధికార పార్టీకే ఎడ్జ్‌ వుంటుంది. కానీ, గ్రౌండ్‌ లెవల్‌లో తమకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదని, ప్రస్తుత ఎస్‌ఈసీ నేతృత్వంలో ఎన్నికలు జరిగితే తమకు చుక్కలు కనిపిస్తాయని వైసీపీ భయపడుతున్నట్లు కన్పిస్తోంది. ‘నిమ్మగడ్డ తిరిగొస్తే ఏం పీకుతాడు.?’ అని ఓ మంత్రిగారు వీరావేశానికి గురయ్యారు గతంలో. ఇంకెందుకు భయం.? నిమ్మగడ్డ హయాంలోనే స్థానిక ఎన్నికలకు వెళ్ళొచ్చుగా.? వెళ్ళడంలేదంటే.. అధికార పార్టీ భయపడుతున్నట్లు ఒప్పుకున్నట్టేగా.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...