రెండు తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా కొత్తవారు రానున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ నియమితులయ్యారు. ఈమేరకు ఈనెల 14న జరిగిన సుప్రీంకోర్టు కొలీజియం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రస్తుతం సిక్కిం రాష్ట్ర హైకోర్టు సీజేగా.. హిమా కోహ్లీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు, తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న ఆర్ఎస్ చౌహాన్ ను ఉత్తరాఖండ్ హైకోర్టులకు బదిలీ చేశారు. వీరితోపాటు ఒడిషా, జమ్ము కశ్మీర్, మద్రాస్, మధ్యప్రదేశ్, కోల్ కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు.
883955 985727I feel other web site proprietors need to take this internet internet site as an example , extremely clean and great user genial style . 916028
399012 770652I enjoy reading write-up. Hope i can discover much more articles like this one. Thanks for posting. 633110
709985 787196Hmm is anyone else experiencing issues with the images on this blog loading? Im trying to uncover out if its a problem on my end or if it is the weblog. Any responses would be greatly appreciated. 693229