ఓ మంత్రిగారు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో. ఆ వార్తని కవర్ చేస్తూ, ఓ పత్రిక ఓ ఫొటోని ప్రచురించింది. అందులో జాతీయ జెండా తలకిందులుగా కన్పించింది. నిజానికి, సదరు మంత్రిగారు సరిగ్గానే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కానీ, ఫొటోనే తేడాగా వచ్చింది. ఇదే ‘పచ్చ మీడియా’కి చెందిన పత్రికలో వచ్చి వుంటే.. నానా యాగీ జరిగేది. మంత్రిగారు పాల్గొన్న కార్యక్రమం కదా.. దాన్ని తప్పుగా చిత్రీకరించినందుకుగాను ప్రభుత్వం తరఫున చర్యలు వుండేవేమో.!
కానీ, ఇక్కడ ఆ ‘తప్పుడు ఫొటో’ ప్రచురితమైంది వైసీపీ అనుకూల మీడియాకి చెందిన పత్రికలో. అదే సాక్షి పత్రిక. చిత్తూరు జిల్లా ఎడిషన్లో ప్రచురితమైన ఆ ఫొటో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ‘జగనన్న రాజ్యాంగం ఇలాగే వుంటుంది..’ అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సెటైర్లు వేసేస్తున్నారు. ‘అది జస్ట్ ప్రింట్ మిస్టేక్.. దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అనుకూల నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, జాతీయ పతాకాన్ని రివర్స్లో ఎగురవేసినా, రివర్స్లో కన్పిస్తున్నట్లు ప్రింట్ చేసినా.. చట్టపరమైన చర్యలుంటాయంటూ సంబంధిత సెక్షన్లను పేర్కొంటూ వైసీపీపై విరుచుకుపడుతున్నారు టీడీపీ మద్దతుదారులు.
మొత్తంగా ఇప్పుడీ జాతీయ జెండా వ్యవహారం పెద్ద రచ్చకే కారణమయ్యింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీస్ పెరేడ్ మైదానంలో మంత్రి పతివాడ నారాయణస్వామి జాతీయ జెండాని ఎగురవేశారు. ఆయన సరిగ్గానే జెండాని ఎగురవేసినట్లు, అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
అన్నట్టు, ఆ మధ్య సన్నబియ్యం విషయమై అసెంబ్లీలో ప్రభుత్వం ఇరకాటంలో పడింది సాక్షిలో వచ్చిన కథనం కారణంగానే. దాంతో, ఏమాత్రం మొహమాటపడకుండా ‘సాక్షిలో తప్పు రాశారు అధ్యక్షా’ అని స్వయానా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి చెప్పుకొచ్చారు. ‘సాక్షాలో తప్పుగా ప్రింట్ చేశారు అధ్యక్షా..’ అంటూ సెటైర్లు పడుతున్నాయిప్పుడు ఈ జాతీయ జెండా వ్యవహారంతో.
550412 50943you use a great blog here! do you wish to earn some invite posts on my small weblog? 248474
995029 352088Last month, when i visited your blog i got an error on the mysql server of yours. ~, 711824