తిరుపతిలో హౌస్ సర్జెన్సీ పూర్తయ్యాక వైఎస్ పనిచేయడం కోసం ఆయన తండ్రి రాజారెడ్డి పులివెందులలో హాస్పటల్ నిర్మాణం తలపెట్టారు. ఈలోగా అనుభవం కోసం జమ్మలమడుగులోని క్యాంప్ బెల్ హాస్పటల్ లో చేరారు. పులివెందులలో ఆస్పత్రి నిర్మాణం పూర్తయిన తర్వాత దాని తొలి మెడికల్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు చేపట్టారు. పేదల నుంచి డబ్బులు తీసుకోవడం ఇష్టం లేక ఫీజు తీసుకునేవారు కాదు. కానీ కార్డు కోసం ఒక రూపాయి మాత్రం తీసుకునేవారు. దీంతో ఆయనకు రూపాయి డాక్టర్ అని పేరు వచ్చింది. తక్కువ సమయంలోనే ఆయన ప్రాక్టీస్ పెరిగింది.
కడప జిల్లాలో మంచి వైద్యుడిగా పేరు సంపాదించుకున్నారు. సీఎం అయిన తర్వాత కూడా ఆయన్ను చాలామంది డాక్టర్ సార్ అనే సంభోదించేవారు. డాక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నా.. సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం వంటి సమస్యలను రూపుమాపాలనే ఆలోచలనే ఎక్కువగా ఉండేవి. అదే ఆయన్ను రాజకీయాల వైపు మళ్లేలా చేసింది.
అప్పటికి ప్రధాని ఇందిరాగాంధీ చేస్తున్న కార్యక్రమాలు నచ్చడంతో యూత్ కాంగ్రెస్ తో చేరారు. 1977 లోక్ సభ ఎన్నికల్లో బాగా ప్రచారం చేశారు. అప్పుడే ఆయనకు కూడా పోటీ చేయాలనో ఆలోచన వచ్చింది. ఆ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ విడిపోయి కొత్తగా ఏర్పడిన రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి సునాయాసంగా గెలుపొందారు. తర్వాత రెడ్డి కాంగ్రెస్.. కాంగ్రెస్ లో విలీనమైపోయింది. అనంతరం 1980లో అంజయ్య మంత్రివర్గంలో వైఎస్ కు స్థానం లభించింది. అనంతరం తనతో మాట్లాడిన తీరుకు ఫిదా అయిన రాజీవ్ గాంధీ.. వైఎస్ కు పీసీసీ పీఠం అప్పగించారు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ కుదేలైన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
అయితే, 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ ఎన్టీఆర్ విజయం సాధించడం.. కాంగ్రెస్ కు అంతకు ముందు కంటే తక్కువ స్థానాలు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ పదవికి వైఎస్ రాజీనామా చేశారు. అనంతరం నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. ఈ తరుణంలో మళ్లీ 1998లో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్.. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించడానికి శతవిధాలా ప్రయత్నాలు చేశారు. కానీ అధికారం రాకపోయినా 91 సీట్లను సాధించగలిగింది. అనంతరం 2003లో పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. ప్రజల సాధక బాధలు విని, ఆ మేరకు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. సోనియాగాంధీ కూడా ఈసారి కాంగ్రెస్ గెలిస్తే సీఎం పీఠం మీదే అని వైఎస్ కు చెప్పడం.. అందరూ ఊహించినట్టే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి వైఎస్ ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి.
(సశేషం)
నాలో.. నాతో.. వైఎస్సార్: రాజేశ్వరి.. వైఫ్ ఆఫ్ వైఎస్సార్ -1
నాలో.. నాతో వైఎస్సార్: వైఎస్ కోసం జగన్, షర్మిల ఏం చేశారు? -2
53775 335064I respect your piece of work, appreciate it for all of the interesting content . 634330
703179 968153hello!,I like your writing so significantly! share we communicate extra approximately your post on AOL? I require an expert in this space to solve my issue. Possibly that is you! Looking ahead to see you. 40626