Switch to English

నాలో.. నాతో.. వైఎస్సార్: రూపాయి డాక్టర్ నుంచి రాష్ట్రాధినేత వరకు.. – 3

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

తిరుపతిలో హౌస్ సర్జెన్సీ పూర్తయ్యాక వైఎస్ పనిచేయడం కోసం ఆయన తండ్రి రాజారెడ్డి పులివెందులలో హాస్పటల్ నిర్మాణం తలపెట్టారు. ఈలోగా అనుభవం కోసం జమ్మలమడుగులోని క్యాంప్ బెల్ హాస్పటల్ లో చేరారు. పులివెందులలో ఆస్పత్రి నిర్మాణం పూర్తయిన తర్వాత దాని తొలి మెడికల్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు చేపట్టారు. పేదల నుంచి డబ్బులు తీసుకోవడం ఇష్టం లేక ఫీజు తీసుకునేవారు కాదు. కానీ కార్డు కోసం ఒక రూపాయి మాత్రం తీసుకునేవారు. దీంతో ఆయనకు రూపాయి డాక్టర్ అని పేరు వచ్చింది. తక్కువ సమయంలోనే ఆయన ప్రాక్టీస్ పెరిగింది.

కడప జిల్లాలో మంచి వైద్యుడిగా పేరు సంపాదించుకున్నారు. సీఎం అయిన తర్వాత కూడా ఆయన్ను చాలామంది డాక్టర్ సార్ అనే సంభోదించేవారు. డాక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నా.. సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం వంటి సమస్యలను రూపుమాపాలనే ఆలోచలనే ఎక్కువగా ఉండేవి. అదే ఆయన్ను రాజకీయాల వైపు మళ్లేలా చేసింది.

అప్పటికి ప్రధాని ఇందిరాగాంధీ చేస్తున్న కార్యక్రమాలు నచ్చడంతో యూత్ కాంగ్రెస్ తో చేరారు. 1977 లోక్ సభ ఎన్నికల్లో బాగా ప్రచారం చేశారు. అప్పుడే ఆయనకు కూడా పోటీ చేయాలనో ఆలోచన వచ్చింది. ఆ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ విడిపోయి కొత్తగా ఏర్పడిన రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి సునాయాసంగా గెలుపొందారు. తర్వాత రెడ్డి కాంగ్రెస్.. కాంగ్రెస్ లో విలీనమైపోయింది. అనంతరం 1980లో అంజయ్య మంత్రివర్గంలో వైఎస్ కు స్థానం లభించింది. అనంతరం తనతో మాట్లాడిన తీరుకు ఫిదా అయిన రాజీవ్ గాంధీ.. వైఎస్ కు పీసీసీ పీఠం అప్పగించారు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ కుదేలైన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.

అయితే, 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ ఎన్టీఆర్ విజయం సాధించడం.. కాంగ్రెస్ కు అంతకు ముందు కంటే తక్కువ స్థానాలు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ పదవికి వైఎస్ రాజీనామా చేశారు. అనంతరం నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. ఈ తరుణంలో మళ్లీ 1998లో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్.. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించడానికి శతవిధాలా ప్రయత్నాలు చేశారు. కానీ అధికారం రాకపోయినా 91 సీట్లను సాధించగలిగింది. అనంతరం 2003లో పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. ప్రజల సాధక బాధలు విని, ఆ మేరకు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. సోనియాగాంధీ కూడా ఈసారి కాంగ్రెస్ గెలిస్తే సీఎం పీఠం మీదే అని వైఎస్ కు చెప్పడం.. అందరూ ఊహించినట్టే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి వైఎస్ ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి.

(సశేషం)

నాలో.. నాతో.. వైఎస్సార్: రాజేశ్వరి.. వైఫ్ ఆఫ్ వైఎస్సార్ -1

నాలో.. నాతో వైఎస్సార్: వైఎస్ కోసం జగన్, షర్మిల ఏం చేశారు? -2

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...