Naga Babu: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెగాఫ్యాన్స్ నిరసన, ర్యాలీలు కూడా చేపట్టారు. ఈక్రమంలో మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వానికి ఘాటు కౌంటర్ ఇచ్చారు.
‘శ్రమని పెట్టుబడిగా పెట్టి.. ప్రభుత్వానికి పన్ను కట్టి ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచుతూ.. 24క్రాఫ్ట్స్ కి అన్నం పెడుతోంది సినీ పరిశ్రమ. పని లేనోడు పిల్లి తల గొరిగినట్టు నిజం మాట్లాడిన వ్యక్తి మీద విషం కక్కుతున్నారు ఏపీ మంత్రులు. చిరంజీవి ఫొటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడా పిచ్చి కూతలు కూస్తున్నారు’.
‘ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే మీ మీదే పడుతుంది. మీ బతుక్కి మీ శాఖల మీద మీకే అవగాహన లేదు. బటన్ నొక్కి కోట్లలో ముంచి వేలల్లో ఉచితాలు పంచడమే అభివృద్ధా..? మీ దుర్మార్గ పాలనకు END CARD దగ్గరలోనే ఉంది. NOTE: కాలం గాలమేస్తే ప్రకృతే శత్రువవుతుంది.. ఆరోగ్యాలు జాగ్రత్త..! అని అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
శ్రమని పెట్టుబడిగా పెట్టి,
పన్నుని ప్రభుత్వానికి అనాపైసలతో సహా కట్టి,
వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి ,
24 క్రాఫ్ట్ లకి అన్నం పెడుతున్న ఏకైన పరిశ్రమ చిత్రపరిశ్రమ..ఏ పని లేనోడు పిళ్లి తల గొరిగినట్టు
నిజం మాట్లడిన వ్యక్తి మీద విషం కక్కుతున్నారు ఆంధ్రా మంత్రులు,ఆయన…— Naga Babu Konidela (@NagaBabuOffl) August 9, 2023