సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా ప్రస్తుతం దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెల్సిందే. దర్శకుడు పరశురామ్ సింప్లిసిటీకి నిదర్శణం అంటూ ఆయన సినిమాలు చెప్పకనే చెబుతూ ఉంటాయి. ఇక సెట్టింగ్ లో ఉన్న సమయంలో ఆయన కూడా చాలా సింపుల్ గా ఉంటాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దుబాయిలో జరుగుతున్న సమయంలో చాలా సింపుల్గా సెట్టింగ్ లో వ్యవహరించడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
దుబాయిలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఆన్ సెట్ ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో దర్శకుడు పరశురామ్ నేలపై కూర్చుని సింపుల్ గా స్క్రిప్ట్ పేపర్ లు చదువుకుంటున్నాడు. మహేష్ బాబు అటుగా వెళ్లుతుండగా పరశురామ్ మాత్రం సింపుల్ గా ఉన్నాడు. దర్శకుడు పరశురామ్ ఈ సినిమాతో మరో విజయాన్ని దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమాలో తమిళ స్టార్ నటుడు కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
158921 233439I used to be recommended this web website by my cousin. Im no longer confident whether this put up is written by way of him as nobody else know such exact approximately my problem. Youre incredible! Thank you! 941080