మనమొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యాన్స్ తో ఒక ఫోటోషూట్ ను ప్లాన్ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం షూటింగ్ ముగించుకుని డబ్బింగ్ కార్యక్రమాల్లో ఉన్న బాబు మళ్ళీ సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్ వర్క్స్ తో బిజీ అయిపోతాడు కాబట్టి నిన్న, ఈరోజు తన ఫ్యాన్స్ కోసం ఒక ఫోటోషూట్ ప్లాన్ చేసాడు.
దాని కోసం కొంత మందిని ఏజెన్సీలా ఏర్పాటు చేసి వారికి బాధ్యతలు అప్పగించాడు. వాళ్ళు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పాస్ లు ఇస్తారు. దాని ప్రకారం ఒకరి తర్వాత ఒకరు వెళ్లి మహేష్ తో ఫొటోస్ దిగుతారు. అనుకోవడానికి చాలా పద్దతిగా, పెర్ఫెక్ట్ గా ఉంది ఇది. ఫ్యాన్స్ కు దగ్గరకావడానికి ఇదే బెస్ట్ పద్దతి అని భావించాడు మహేష్. నిజానికి ఇదే మొదటిసారి కాదు, లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటిదే చేసాడు. అప్పుడంతా సవ్యంగా జరిగిపోయింది, కాకపోతే ఇప్పుడంతా రసాభాస అయింది.
ఫ్యాన్స్ తో మీట్ ఏర్పాటు చేసారు బానే ఉంది. కానీ దానికి తగిన ఏర్పాట్లు చేయాలి కదా. మహేష్ ఫ్యాన్స్ అంటే ఏదో వంద మందో, 500 మందో వస్తారనుకుంటే ఎలా? కనీసం పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోలేదు. తీరా నిన్న ఫంక్షన్ కు 5 వేల మంది వచ్చారు. హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీ వేదిక. సరైన ప్లానింగ్, జాగ్రత్తలు లేకపోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. ఇద్దరి కాళ్ళు విరిగిపోయాయి. దాంతో ఒక్కసారి ఫ్యాన్స్ లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. మహేష్ మీద డైరెక్ట్ గా నెగటివ్ గా మాట్లాడకపోయినా అందరూ చెప్పేది ఒకటే. మినిమం జాగ్రత్తలు తీసుకోకుండా ఇలాంటి ఒక మీట్ ఎలా ఏర్పాటు చేస్తారని? కొంతమంది బహిరంగంగానే మాట్లాడుతున్నారు.
ఇంకోటి ఉంది, ఫ్యాన్స్ ను మహేష్ కు కనెక్ట్ చేయడానికి మధ్యలో ఏజెన్సీ ఉంది కదా, వాళ్ళు బాబును త్వరగా కలిపిస్తాం అని చెప్పి 500, 1000 నొక్కేసారట. అది కూడా మహేష్ కు నెగటివ్ గా మారింది. దీంతో ఈరోజు మీట్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. ఏజెన్సీను పీకేసి మళ్ళీ కొత్తగా ఫ్యాన్స్ పాస్ లు అందజేశారు. ఈరోజు ఈవెంట్ కొంచెం సవ్యంగా సాగినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ జాగ్రత్తలు ఏవో ముందే తీసుకుని ఉంటే సరిపోయేది కదా బాబు అంటున్నారు ఫ్యాన్స్.