Switch to English

ఈ జాగ్రత్త ఏదో ముందే తీసుకుని ఉంటే బాగుండేదిగా బాబు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మనమొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యాన్స్ తో ఒక ఫోటోషూట్ ను ప్లాన్ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం షూటింగ్ ముగించుకుని డబ్బింగ్ కార్యక్రమాల్లో ఉన్న బాబు మళ్ళీ సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్ వర్క్స్ తో బిజీ అయిపోతాడు కాబట్టి నిన్న, ఈరోజు తన ఫ్యాన్స్ కోసం ఒక ఫోటోషూట్ ప్లాన్ చేసాడు.

దాని కోసం కొంత మందిని ఏజెన్సీలా ఏర్పాటు చేసి వారికి బాధ్యతలు అప్పగించాడు. వాళ్ళు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పాస్ లు ఇస్తారు. దాని ప్రకారం ఒకరి తర్వాత ఒకరు వెళ్లి మహేష్ తో ఫొటోస్ దిగుతారు. అనుకోవడానికి చాలా పద్దతిగా, పెర్ఫెక్ట్ గా ఉంది ఇది. ఫ్యాన్స్ కు దగ్గరకావడానికి ఇదే బెస్ట్ పద్దతి అని భావించాడు మహేష్. నిజానికి ఇదే మొదటిసారి కాదు, లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటిదే చేసాడు. అప్పుడంతా సవ్యంగా జరిగిపోయింది, కాకపోతే ఇప్పుడంతా రసాభాస అయింది.

ఫ్యాన్స్ తో మీట్ ఏర్పాటు చేసారు బానే ఉంది. కానీ దానికి తగిన ఏర్పాట్లు చేయాలి కదా. మహేష్ ఫ్యాన్స్ అంటే ఏదో వంద మందో, 500 మందో వస్తారనుకుంటే ఎలా? కనీసం పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోలేదు. తీరా నిన్న ఫంక్షన్ కు 5 వేల మంది వచ్చారు. హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీ వేదిక. సరైన ప్లానింగ్, జాగ్రత్తలు లేకపోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. ఇద్దరి కాళ్ళు విరిగిపోయాయి. దాంతో ఒక్కసారి ఫ్యాన్స్ లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. మహేష్ మీద డైరెక్ట్ గా నెగటివ్ గా మాట్లాడకపోయినా అందరూ చెప్పేది ఒకటే. మినిమం జాగ్రత్తలు తీసుకోకుండా ఇలాంటి ఒక మీట్ ఎలా ఏర్పాటు చేస్తారని? కొంతమంది బహిరంగంగానే మాట్లాడుతున్నారు.

ఇంకోటి ఉంది, ఫ్యాన్స్ ను మహేష్ కు కనెక్ట్ చేయడానికి మధ్యలో ఏజెన్సీ ఉంది కదా, వాళ్ళు బాబును త్వరగా కలిపిస్తాం అని చెప్పి 500, 1000 నొక్కేసారట. అది కూడా మహేష్ కు నెగటివ్ గా మారింది. దీంతో ఈరోజు మీట్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. ఏజెన్సీను పీకేసి మళ్ళీ కొత్తగా ఫ్యాన్స్ పాస్ లు అందజేశారు. ఈరోజు ఈవెంట్ కొంచెం సవ్యంగా సాగినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ జాగ్రత్తలు ఏవో ముందే తీసుకుని ఉంటే సరిపోయేది కదా బాబు అంటున్నారు ఫ్యాన్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...