అభిమానం కట్టలు తెంచుకుంటే .. ఎలా ఉంటుందో ఈ సంగటన చెబుతుంది. తమ అభిమాన తారలను కలవాలని .. వారితో ఫోటో దిగాలని .. వీలయితే వారితో మాట్లాడాలని చాలా మంది ఫాన్స్ తెగ ఆరాటపడిపోతుంటారు. అలాంటి అవకాశం వస్తే మాత్రం .. మీదపడిపోతారు. వారికి ఎలాంటి అడ్డు అదుపు, క్రమశిక్షణ లేకుండా ఒక్కసారిగా మీదపడి నానా రచ్చ చేసిన సంఘటనలు ఉన్నాయి. అందుకే స్టార్స్ సరైన సెక్యూరిటీ లేకుండా బయటికి రావాలంటే భయపడిపోతారు. తాజాగా ఫాన్స్ విషయంలో మహేష్ హార్ట్ అయ్యాడు .. అందుకే వారిని ఏడాదిపాటు కలవొద్దని నిర్ణయం తీసుకున్నాడట ? ప్రస్తుతం మహేష్ నిర్ణయంతో ఫాన్స్ లో టెన్షన్ పట్టుకుంది.
అసలు ఏమి జరిగింది ? మహేష్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి ? అన్న వివరాల్లోకి వెళితే .. మహేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా ఈ సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా హైద్రాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఫోటో షూట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అభిమానులు మీరు అటెండ్ అవ్వండి అంటూ టీమ్ పిలుపు ఇవ్వడంతో ఇంకేముంది మహేష్ ఫాన్స్ .. వేలకొద్దీ జనాలు హాజరయ్యారు.
వందల్లోనే వస్తారనుకుంటే .. వేలల్లో .. ఫాన్స్ రావడంతో అక్కడ తోపులాట జరిగింది, ఆ తోపులాటలో .. ఒకరిపై ఒకరు పడడంతో .. ఇద్దరి కాళ్ళు విరిగాయి .. దాంతో వారిని పక్కనే ఉన్న సుంషైన్ హాస్పిటల్ కు తరలించారు. స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఈ ఈవెంట్ ను ఏర్పాటు చేయడంతో పోలీసులు సినిమా యూనిట్ పై కేసు నమోదు చేసారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న మహేష్ టీమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ .. అటు ఏడాది పాటు అభిమానులను కలవకూడదని నిర్ణయం తీసుకున్నాడట. అది విషయం.