కొందరు జల్సాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటే .. ఇంకొందరు అవే జల్సాలకు అలవాటు పడి కెరీర్ ని నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఇదే మోజులో పడ్డ ఓ క్రేజీ యాంకర్ తన వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టింది ? ఇంతకీ ఎవరా యాంకర్ ? ఏమా కథ అంటే .. ప్రస్తుతం టివి మీడియాలో యాంకర్స్ జోరు ఓ రేంజ్ లో ఉంది. ఇప్పటికే పాపులర్ యాంకర్స్ గా క్రేజీ తెచ్చుకున్న వాళ్ళల్లో సుమ, ఝాన్సీ, అనసూయ, రష్మీ ఇలా చెప్పుకుంటూ పొతే పెద్ద లిస్ట్ వస్తుంది. అయితే ఈ యాంకర్స్ అందరు మంచి క్రేజ్ తెచ్చుకున్నవారే. ఈ లిస్ట్ లో యాంకర్ ఝాన్సీ కి మంచి పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. ఝాన్సీ అప్పట్లో నటుడు జోగి నాయుడిని పెళ్లి చేసుకుని దాదాపు ఎనిమిదేళ్ల కాపురం తరువాత విడిపోయింది.
వీరిద్దరి ఎందుకు విడిపోయారు అన్న ? ప్రశ్న ఇప్పటికి చాలా మందిలో ఉంది. నిజానికి వీరిద్దరూ విడిపోయిన సమయంలో జోగి నాయుడు విపరీతమైన వేధింపుల కారణంగానే ఆమె విడిపోయిందంటూ ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయాన్నీ బయటపెట్టాడు ఝాన్సీ మాజీ భర్త జోగి నాయుడు. ఇద్దరం ఒకేసారి కెరీర్ ప్రారంభించాం. ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. దాదాపు ఎనిమిదేళ్లు హాయిగా ఉన్నాం . ఆ తరువాత ఝాన్సీ కి డబ్బుపై వ్యామోహం ఎక్కువైంది. ఇతరుల్లాగే తాము ఎంజాయ్ చేయాలనీ కోరుకునేది. అలా డబ్బు వల్ల మా మధ్య విభేదాలు తలెత్తాయి. ఆమెకు జల్సాలంటే విపరీతమైన వ్యామోహం, అందుకే మా మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి .. తరువాత విడిపోయాం అంటూ చెప్పేసాడు.
అయినా తన పై నాకు ప్రేమ తగ్గలేదని, ఆమె ఎప్పటికైనా నా దగ్గరికి వస్తుందన్న నమ్మకం ఉండేదని, దానికోసం ఎనిమిదేళ్లు వెయిట్ చేసానని, అసలు తానంటేనే ఆమెకు ఇష్టం లేదని తెలుసుకున్నాక మరో పెళ్లి చేసుకున్నానని చెప్పాడు జోగి నాయుడు. మొత్తానికి జల్సాల కారణంగా .. డబ్బు వ్యామోహంతోనే ఝాన్సీ తన వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టిందా !!
132101 642247Extremely properly written story. It will probably be valuable to anyone who usess it, including yours truly . Keep up the good work – canr wait to read more posts. 887809