‘జె గ్యాంగ్ చెన్నయ్ హవాలా’ అనే హ్యాష్ట్యాగ్తో మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ఆరోపణల్ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతల మీద చేశారు. ఇందులో మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి పేరు డైరెక్ట్గానే ప్రస్తావనకు వస్తే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పేరు పరోక్షంగా వచ్చింది. నిజానికి ఆ హ్యాష్ట్యాగ్లోనే ‘జగన్’ అనే అక్షరాలు కన్పిస్తాయి.
ఇటీవల తమిళనాడు – ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో వైసీపీ నేతకు చెందిన 5 కోట్ల 22 లక్షల రూపాయల నగదు తమిళనాడు పోలీసులకు చిక్కిన విషయం విదితమే. సదరు వైసీపీ నేత నల్లమల్లి బాలు స్వయానా మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డికి అత్యంత సన్నిహితుడు. పైగా, పోలీసులకు దొరికిన వాహనానికి వైసీపీకే చెందిన మరో ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేరుతో ‘ఎమ్మెల్యే స్టిక్కర్’ వుంది కూడా. ఈ ఘటన జరిగినప్పటినుంచీ వైసీపీని టీడీపీ ఏకిపారేస్తోంది.
తాజాగా, నారా లోకేష్, ఈ వివాదానికి సంబంధించి మరికొన్ని ఆసక్తికరమైన అంశాల్ని తెరపైకి తెచ్చారు. చెన్నయ్ కేంద్రంగా నాలుగు సూట్కేసు కంపెనీల్ని ఒకే భవనంలో నడిపిస్తున్నారనీ, వారంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులు, సన్నిహితులేనన్నది నారా లోకేష్ ఆరోపణ. ఆయా కంపెనీల పేర్లను ప్రస్తావిస్తూ, ‘హవాలా’ కోసమే ఈ కంపెనీలు తెరిచినట్లు లోకేష్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ‘విశ్వసనీయ వర్గాల సమాచారం’ అని నారా లోకేష్ ట్వీట్ చేయడం గమనార్హం. వరుస ట్వీట్లతో నారా లోకేష్ హోరెత్తించేశారు.
మరోపక్క, టీడీపీకి చెందిన పలువురు నేతలు, ఆ పార్టీ మద్దతుదారులు.. చెన్నయ్లో అతి ఖరీదైన ఓ ‘ప్యాలెస్’ని నిర్మిస్తున్న వైఎస్ జగన్, ఈ క్రమంలోనే కొన్ని లారీల్లో సామాన్లను అక్కడికి తరలించారనీ, ఆ సామన్ల మాటున ఇంకెన్ని ‘చీకటి వ్యవహారాలు’ వున్నాయోనని అనుమానం వ్యక్తం చేస్తూ ట్వీట్లేస్తుండడం గమనార్హం. సోషల్ మీడియాలో ప్రభుత్వంపైనగానీ, పార్టీ నేతలపైనగానీ ఎవరన్నా విమర్శలు చేస్తే.. ‘లోపల’ వేసేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం, మరి ఇప్పుడు ఈ వ్యవహారంలో నారా లోకేష్పై అవే తరహా చర్యలు తీసుకుంటుందా.? అంతకన్నా ముందు, ఈ కోట్లాది రూపాయల హవాలా.. అంటూ వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వ పెద్దలు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడిందన్నది నిర్వివాదాంశం.
‘5 కోట్లు ఓ వాహనంలో దొరికినవి మాత్రమే.. ఇలాంటివి ఇంకో మూడు నాలుగు వాహనాలు బోర్డర్ దాటాయి ఇటీవలి కాలంలో.. ఈ మొత్తం కుంభకోణం 1200 కోట్ల పై మాటే..’ అంటూ సోషల్ మీడియాలో టీడీపీ మీమ్స్ దర్శనమిస్తున్న దరిమిలా.. దీన్ని చిన్న విషయంగా కొట్టి పారేయలేని పరిస్థితి ఏర్పడింది.
చెన్నైలో ఒకే అడ్రస్ తో ఉన్న ఫారెస్ ఇంపెక్స్, క్వన్నా ఎగ్జిమ్, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీలకు వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ భారతీ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డిలు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. (2/4)#JGangChennaiHawala
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 18, 2020
అక్రమంగా దోచుకోవడం, సూట్ కేసు సంస్థలు పెట్టి వాటిల్లోకి మళ్ళించడం, అక్కడ నుంచి హవాలా మార్గంలో డబ్బును విదేశాలకు తరలించడం… ఏ-1, ఏ-2ల గత చరిత్ర మొత్తం ఇదే! ఇప్పుడూ అదే నడుస్తోంది. ఈ మొత్తం తతంగంపై సమగ్ర దర్యాప్తు జరగాలి. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. (4/4)#JGangChennaiHawala
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 18, 2020
578569 955721Companion, this internet internet site will probably be fabolous, i merely like it 806070
584978 51610Hey. Really nice internet web site!! Man .. Outstanding .. Wonderful .. Ill bookmark this web internet site and take the feeds alsoI am happy to locate so much useful details here within the article. Thanks for sharing 137414