ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే చర్చ.! ఔను, వైఎస్ జగన్ అలా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై నోరు పారేసుకోవడమే జనసేన పార్టీకి మంచిది.. అని చర్చించుకుంటున్నారు జనం.
ఎందుకిలా.? అంటే, నిన్న మొన్నటిదాకా పొలిటికల్ ఈక్వేషన్స్ వేరు. ఇప్పుడు మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్ వేరు. ప్రతి ఎన్నికల్లోనూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల తీర్పు, రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి.
2019 ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలబడిన ఈ ప్రాంతం, ఈసారి జనసేన వైపు చూస్తోంది. జనసేనతో కలిసి వుంది కాబట్టి, టీడీపీకి కాస్త ఎడ్జ్ దొరకొచ్చు. అది జనసేనకు టీడీపీ ఇచ్చే గౌరవాన్ని బట్టి ఆధారపడి వుంటుంది.
ఉత్తరాంధ్రలో కూడా దాదాపు ఇదే ఈక్వేషన్ కనిపిస్తోంది. తాజాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై చేసిన దిగజారుడు వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ప్రజానీకంలో లోతైన చర్చ జరుగుతోంది. ‘ప్రతిసారీ అదే చెత్త వాగుడేంటి.?’ అన్న కోణంలో జనం చర్చించుకుంటున్నారు.
ఈ వ్యవహారాన్ని వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గ్రౌండ్ లెవల్ పరిస్థితుల్ని ఎవరైనా వివరిస్తే బావుణ్ణు..’ అంటూ వాట్సాప్ మెసేజ్లు వైసీపీ గ్రూపుల్లో పోస్ట్ చేసుకుంటున్నారు.
కాగా, జనసేనపై వైఎస్ జగన్ విమర్శలు తమకూ లాభిస్తాయని టీడీపీ భావిస్తోంది. ఇదో వింత పరిణామం.!