ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి జనసేన దెబ్బ పడిందా? ఆ పార్టీ ఓట్లను పవన్ కల్యాణ్ పార్టీ కొల్లగొట్టిందా? క్షేత్రస్థాయిలో సైలెంట్ గా ఈ పని జరిగిపోయిందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. టీడీపీ ఓట్లకు జనసేన భారీగానే గండి పెట్టిందని అంటున్నారు. 2014 ఎన్నికల్లో ప్రధాన పోరు వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం పార్టీల మధ్యే సాగింది. అప్పుడు వైఎస్సార్ సీపీ ఒకవైపు ఉండగా.. తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి పోటీచేశాయి. టీడీపీ, బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం చేశారు. పవన్ ప్రచారం, ప్రధాని మోదీ వేవ్ కలిసి రావడంతో టీడీపీకి అధికార పగ్గాలు అందాయి.
అధికార, ప్రతిపక్షాల మధ్య ఓట్ల శాతం చాలా తక్కువగానే ఉన్నప్పటికీ, సీట్లు మాత్రం టీడీపీకి ఎక్కువగా వచ్చాయి. చాలా నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతోనే టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కానీ ఈసారి పరిస్థితి మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో కటీఫ్ అయ్యారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా టీడీపీకి రాంరాం చెప్పి సొంతంగా బరిలోకి దిగారు. బీఎస్పీ, వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేశారు. అయితే, ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి చంద్రబాబు పన్నిన వ్యూహమని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపణలు చేశారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ వైపు వెళ్లకుండా పవన్ చీలిస్తే, తాము గట్టెక్కుతామనే ఉద్దేశంతో చంద్రబాబే పవన్ ను విడిగా పోటీలో దింపారని పేర్కొన్నారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం టీడీపీకి నిజంగా చెక్ చెప్పే విధంగా ఉందని సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీకి పడిన ఓట్లను గణనీయంగా జనసేన కొల్లగొట్టిందని అంటున్నారు. జనసేన ఈ ఎన్నికల్లో ప్రధానంగా శ్రీకాకుళం, విశాఖపట్నంతోపాటు ఉభయగోదావరి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలపైనే దృష్టి సారించింది. ఆయా జిల్లాల్లో తాము గెలిచే అవకాశం ఉన్నచోట్ల కష్టపడింది.
మరోవైపు ప్రచారం జరుగుతున్న సమయంలో పవన్ తమవాడే అన్న సూచనలు జనాల్లోకి వెళ్లే విధంగా చంద్రబాబు మైండ్ గేమ్ ఆడారు. దీనికి తగ్గట్టుగా పవన్ కూడా కేవలం జగన్ మీదే విమర్శలు చేస్తూ.. చంద్రబాబును పల్లెత్తు మాట అనకపోవడంతో చాలామంది టీడీపీ, జనసేన మధ్య ఏదో అవగాహన ఉందనే భావించారు. అయితే, పవన్ మాత్రం తాము ఓంటరిగానే పోటీ చేస్తున్నామని.. టీడీపీ, వైఎస్సార్ సీపీలకు సమాన దూరం పాటిస్తున్నామని స్పష్టంచేశారు. మొత్తమ్మీద పోలింగ్ రోజు వచ్చేసరికి జనసేన ఓట్లన్నీ ఆ పార్టీకే పడినట్టు తెలుస్తోంది. అభ్యర్థి ఎవరనే విషయం పక్కనపెట్టి, జనసేన అభిమానులంతా తమ పార్టీకే మద్దతుగా నిలిచారు. వీరంతా గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసినవారే కావడం గమనార్హం.
రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో అనుభవానికి పట్టం కట్టే ఉద్దేశంతో హైదరాబాద్, బెంగళూరు, పుణె తదితర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసల కోర్చి మరీ పెద్ద సంఖ్యలో జనం ఓటేయడానికి ఏపీకి వెళ్లారు. వారిలో ఎక్కువ మంది చంద్రబాబుకే మద్దతుగా నిలిచారు. ఈ సారి కూడా అదే స్థాయిలో జనం ఆయా ప్రాంతాల నుంచి ఏపీకి తరలి వెళ్లారు. అయితే, ఓట్లు మాత్రం టీడీపీ నుంచి జనసేకు మారాయి. అంటే గత ఎన్నికల్లో టీడీపీకి పడిన చాలా ఓట్లు ఈసారి జనసేనకు పడ్డాయన్నమాట. ఆ మేరకు ఆయా స్థానాల్లో టీడీపీ ఓట్లు తగ్గనున్నాయి. ఇది ఆ పార్టీ విజయావకాశాలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. వాస్తవంగా ఏమి జరిగిందో తెలియాలంటే 40 రోజులు ఆగక తప్పదు.
511826 740438I believe this is among the most vital info for me. And im glad reading your article. But wanna remark on few general things, The site style is perfect, the articles is actually wonderful : D. Good job, cheers 444083
176139 323716Right after study several the websites on your own internet web site now, i truly like your indicates of blogging. I bookmarked it to my bookmark web site list and will also be checking back soon. Pls consider my web-site likewise and tell me what you consider. 686114
303108 311859Some truly select articles on this internet web site , bookmarked . 274610