Switch to English

తెలుగుదేశానికే జనసేన దెబ్బ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి జనసేన దెబ్బ పడిందా? ఆ పార్టీ ఓట్లను పవన్ కల్యాణ్ పార్టీ కొల్లగొట్టిందా? క్షేత్రస్థాయిలో సైలెంట్ గా ఈ పని జరిగిపోయిందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. టీడీపీ ఓట్లకు జనసేన భారీగానే గండి పెట్టిందని అంటున్నారు. 2014 ఎన్నికల్లో ప్రధాన పోరు వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం పార్టీల మధ్యే సాగింది. అప్పుడు వైఎస్సార్ సీపీ ఒకవైపు ఉండగా.. తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి పోటీచేశాయి. టీడీపీ, బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం చేశారు. పవన్ ప్రచారం, ప్రధాని మోదీ వేవ్ కలిసి రావడంతో టీడీపీకి అధికార పగ్గాలు అందాయి.

అధికార, ప్రతిపక్షాల మధ్య ఓట్ల శాతం చాలా తక్కువగానే ఉన్నప్పటికీ, సీట్లు మాత్రం టీడీపీకి ఎక్కువగా వచ్చాయి. చాలా నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతోనే టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కానీ ఈసారి పరిస్థితి మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో కటీఫ్ అయ్యారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా టీడీపీకి రాంరాం చెప్పి సొంతంగా బరిలోకి దిగారు. బీఎస్పీ, వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేశారు. అయితే, ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి చంద్రబాబు పన్నిన వ్యూహమని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపణలు చేశారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ వైపు వెళ్లకుండా పవన్ చీలిస్తే, తాము గట్టెక్కుతామనే ఉద్దేశంతో చంద్రబాబే పవన్ ను విడిగా పోటీలో దింపారని పేర్కొన్నారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం టీడీపీకి నిజంగా చెక్ చెప్పే విధంగా ఉందని సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీకి పడిన ఓట్లను గణనీయంగా జనసేన కొల్లగొట్టిందని అంటున్నారు. జనసేన ఈ ఎన్నికల్లో ప్రధానంగా శ్రీకాకుళం, విశాఖపట్నంతోపాటు ఉభయగోదావరి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలపైనే దృష్టి సారించింది. ఆయా జిల్లాల్లో తాము గెలిచే అవకాశం ఉన్నచోట్ల కష్టపడింది.

మరోవైపు ప్రచారం జరుగుతున్న సమయంలో పవన్ తమవాడే అన్న సూచనలు జనాల్లోకి వెళ్లే విధంగా చంద్రబాబు మైండ్ గేమ్ ఆడారు. దీనికి తగ్గట్టుగా పవన్ కూడా కేవలం జగన్ మీదే విమర్శలు చేస్తూ.. చంద్రబాబును పల్లెత్తు మాట అనకపోవడంతో చాలామంది టీడీపీ, జనసేన మధ్య ఏదో అవగాహన ఉందనే భావించారు. అయితే, పవన్ మాత్రం తాము ఓంటరిగానే పోటీ చేస్తున్నామని.. టీడీపీ, వైఎస్సార్ సీపీలకు సమాన దూరం పాటిస్తున్నామని స్పష్టంచేశారు. మొత్తమ్మీద పోలింగ్ రోజు వచ్చేసరికి జనసేన ఓట్లన్నీ ఆ పార్టీకే పడినట్టు తెలుస్తోంది. అభ్యర్థి ఎవరనే విషయం పక్కనపెట్టి, జనసేన అభిమానులంతా తమ పార్టీకే మద్దతుగా నిలిచారు. వీరంతా గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసినవారే కావడం గమనార్హం.

రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో అనుభవానికి పట్టం కట్టే ఉద్దేశంతో హైదరాబాద్, బెంగళూరు, పుణె తదితర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసల కోర్చి మరీ పెద్ద సంఖ్యలో జనం ఓటేయడానికి ఏపీకి వెళ్లారు. వారిలో ఎక్కువ మంది చంద్రబాబుకే మద్దతుగా నిలిచారు. ఈ సారి కూడా అదే స్థాయిలో జనం ఆయా ప్రాంతాల నుంచి ఏపీకి తరలి వెళ్లారు. అయితే, ఓట్లు మాత్రం టీడీపీ నుంచి జనసేకు మారాయి. అంటే గత ఎన్నికల్లో టీడీపీకి పడిన చాలా ఓట్లు ఈసారి జనసేనకు పడ్డాయన్నమాట. ఆ మేరకు ఆయా స్థానాల్లో టీడీపీ ఓట్లు తగ్గనున్నాయి. ఇది ఆ పార్టీ విజయావకాశాలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. వాస్తవంగా ఏమి జరిగిందో తెలియాలంటే 40 రోజులు ఆగక తప్పదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...