Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతలు కొందరు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారంపై, జనసేన పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. జనసేనాని వ్యక్తిగత జీవితంపై కావాలని దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ అను‘కుల’ మీడియా సంస్థలు, వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది జనసేన.
అధికార వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలతోపాటు, ఆ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న యూ ట్యూబ్ ఛాన్సల్, పలు మీడియా సంస్థలపై చట్ట పరమైన చర్యలు తీసుకోనున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది.
ఈ లిస్టులో ప్రముఖ వెబ్ పోర్టల్ సహా, సాక్షి మీడియా సంస్థ కూడా వుండడం గమనార్హం. వైసీపీ అధికార ప్రతినిథి నాగార్జున యాదవ్, వైసీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్న అనితా రెడ్డి తదితరుల్నీ ఈ లిస్టులో పేర్కొన్నారు.
ఏపీ పారెస్ట్ కార్పొరేషన్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిజిటల్ డైరెక్టర్, వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి దేవేంద్ర రెడ్డి గుర్రంపాటి తదితరులకు లీగల్ నోటీసులు ఇవ్వనుంది జనసేన.
పవన్ కళ్యాణ్, తన సతీమణి అన్నా లెజినెవాతో విడాకులు తీసుకున్నారంటూ వైసీపీ అను‘కుల’ మీడియా మొదలు పెట్టిన ప్రచారానికి, వైసీపీ మద్దతుదారులు వంత పాడుతూ, అత్యంత జుగుప్సాకరంగా సోషల్ మీడియాలో వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని జనసేన చాలా సీరియస్గా తీసుకుంది.
ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయడం, ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారం చేయడం, నేర పూరిత కుట్ర.. తదితర సెక్షన్ల కింద చట్ట పరమైన చర్యలకు జనసేన పార్టీ సంసిద్ధమవుతోంది. ఈ మేరకు జనసేన పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ సాంబశివ ప్రతాప్ పేరుతో జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.
జనసేన పార్టీ చట్టపరమైన చర్యలకు దిగితే, వ్యవస్థలు ఎలా పని చేస్తాయన్న సంగతి తేలిపోతుంది.
జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారి వ్యక్తిగత జీవితంపై తప్పుడు కథనాలు, అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై @JanaSenaParty చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోనుంది.
వీరిలో అధికార @YSRCParty కి చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటుగా, వారి అనుబంధ యూట్యూబ్ ఛానెల్స్, పలు మీడియా సంస్థలపై… pic.twitter.com/c02ioaYqA0
— JanaSena Party (@JanaSenaParty) July 7, 2023