వ్యాక్సిన్ వచ్చే వరకూ కొవిడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. కరోనా ఎవరైనా సోకే ప్రమాదం ఉందని.. ప్రజల్లో ఈ మహమ్మారిపై విస్తృతంగా అవగాహన పెంచాలని అన్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. కరోనా సోకిందనే అనుమానం వస్తే ఎవరికి ఫోన్ చేయాలి.. ఏం చేయాలనేదానిపై ప్రజలకు అవగాహన పెంచాలని అన్నారు. కరోనా పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయి.. ఏ నెంబర్ కు ఫోన్ చేయాలనేది హోర్డింగుల రూపంలో ఏర్పాటు చేయాలని సూచించారు.
వైరస్ సోకిన వారిలో 85శాతం మంది ఇళ్లలోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారన్నారు. అవకాశం లేని వారు మాత్రమే ఆసుపత్రులకు వస్తున్నారని అన్నారు. ఇటువంటి వారు కోవిడ్ సెంటర్లకు రావాలని అన్నారు. ఈ సెంటర్లలో కరోనా సోకిన వారిని అత్యంత జాగ్రత్తగా చూసుకుంటారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను నియంత్రించడం కంటే కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వస్తే పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచడం ముఖ్యమన్నారు. దీనిపై అధికారులు ఎక్కువగా దృష్టి సారించాలన్నారు. సరిహద్దులు దాటి రాకపోకలు పెరుగుతున్నాయి..
విదేశీ ప్రయాణాలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందేనని సూచించారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామని.. వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు తసుకున్నామని సీఎం అన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చిన తొలి రాష్ట్రం ఏపీనే అని సీఎం ఈ సందర్భంగా అన్నారు.
116500 306355Depending on yourself to make the decisions can genuinely be upsetting and frustrating. It takes years to build confidence. Frankly it takes much more than just happening to happen. 833924