శాసన మండలి రద్దు దిశగా ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోన్న విషయం విదితమే. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా ఇదే కోరుకుంటున్నట్లు కన్పిస్తోంది.. గత కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు తీరు చూస్తోంటే. చంద్రబాబు తనయుడు లోకేష్, శాసన మండలికి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం విదితమే.
శాసన మండలిలో ప్రస్తుతానికి టీడీపీదే మెజార్టీ. అయితే, రానున్న కొద్ది నెలల్లోనే టీడీపీ ప్రాతినిథ్యం శాసన మండలిలో గణనీయంగా తగ్గబోతోంది. ఆ తర్వాత శాసన మండలిలో టీడీపీ సంఖ్యాబలం పూర్తిగా బలహీనపడిపోతుంది. మరోపక్క, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలచుకుంటే, ఇప్పటికిప్పుడు శాసన మండలిలో టీడీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈ నేపథ్యంలో ‘ఫిరాయింపుల’ ద్వారా నష్టపోవడం కంటే, శాసన మండలి రద్దవడమే మంచిదన్నది చంద్రబాబు ఆలోచనగా కన్పిస్తోంది. శాసన మండలి గనుక రద్దయితే, తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత నష్టం మామూలే. అదే సమయంలో రాజకీయంగా వైఎస్సార్సీపీకి చాలా డ్యామేజీ జరుగుతుంది.
శాసన మండలి సభ్యత్వంపై చాలామంది ఆశపడుతున్నారు వైసీపీలో. వాళ్ళంతా పార్టీ అధిష్టానానికి ఎదురు తిరిగే అవకాశాలున్నాయి. ఇదే విషయమై వైసీపీలోనూ చర్చ చాలా హాట్గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సో, ఎలా చూసినా శాసన మండలి రద్దు అనేది పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చే అంశమే. టీడీపీకి కలిసొచ్చే పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ చేయకపోవచ్చు.
337360 249747I gotta bookmark this internet site it seems very useful very beneficial 862931
235667 974338I consider something genuinely special in this site . 919207
531740 494135I was reading via some of your content on this internet internet site and I believe this web site is actually instructive! Maintain putting up. 451311