అమెరికాలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా 1మిలియన్ డాలర్లు అక్రమంగా ఆర్జించిన ఏడుగురు భారతీయులపై ఫెడరల్ అధికారులు కేసులు నమోదు చేశారు. వీరంతా తెలుగువారని తెలుస్తోంది. మార్చి-మే 2020లో వర్క్ ఫ్రమ్ హోమ్ లో భాగంగా వీరు ఈ మోసానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. స్నేహితులైన హరి ప్రసాద్ సూరి, లోకేశ్ లగుడు, చోటు ప్రభుతేజ్ శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ‘ట్విలియో’ క్లౌడ్ కంప్యూటింగ్ కమ్యునికేషన్స్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు.
2020లో హరి ప్రసాద్ కంపెనీ రహస్య వివరాలను తన స్నేహితుడు దిలీప్ కుమార్ రెడ్డికి, లోకేశ్ తన గర్ల్ ఫ్రెండ్, స్నేహితుడు అభిషేక్, ప్రభుతేజ్ తన సోదరుడు ప్రభుకి తెలపారు. దీంతో ముగ్గురు స్నేహితులూ కలిసి కంపెనీ రెవెన్యూ డేటా బేస్ యాక్సిస్ చేసి సమాచారం సేకరించారు. దీని ద్వారా కంపెనీ త్రైమాసిక ఫలితాల్లో ఈ వివరాలు వెల్లడిస్తే కంపెనీ షేర్లు పెరుగుతాయని అంచనా వేశారు. దీంతో కంపెనీ ఫలితాలు వెల్లడించడానికి ముందే మిగిలిన నలుగురు ట్విలియోలో స్టాక్స్ లో భారీ పెట్టుబడులు పెట్టారు. అనుకున్నట్టే ఫలితాలు వెల్లడించిన అనంతరం కంపెనీ షేర్లు భారీగా పెరిగిపోయాయి.
దీంతో వీరంతా లాభాల బాట పట్టారు. అయితే.. ఒక్కసారిగా భారీగా పెరిగిన షేర్లపై సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ కు అనుమానం రావడంతో కంపెనీ షేర్లు, వివరాలు ఆరా తీసారు. దీంతో వీరు కంపెనీలో అక్రమాలకు పాల్పడినట్టు బయటపడింది. ఈ ప్రక్రియలో వారి సంప్రదింపులకు ప్రైవేట్ చాటింగ్ చేసుకుని ట్విలియోకు సంబంధించిన ట్రేడింగ్, షేర్లు వివరాలన్నింటిని మాట్లాడుకున్నట్టు గుర్తించారు. ఎక్కువగా తెలుగులో.. భారత్ నుంచి కూడా వీరి మధ్య సంభాషణ జరిగినట్టు గుర్తించారు. కమిషన్ చేపట్టిన దర్యాప్తులో ఈ ఏడుగురు 1 మిలియన్ డాలర్లు అక్రమంగా సంపాదించారని తేలింది. దీంతో ఫెడరల్ అధికారులకు కమిషన్ ఫిర్యాదు చేయడంతో ఏడుగురిపై కేసులు నమోదు చేశారు.
436748 375796Immer etliche Firmen bentzen heutzutage Interimmanagement als innovatives und ergnzendes Gertschaft i. Spanne der Unternehmensfhrung. Denn hiermit wird Kenntnisstand leistungsfhig, bedarfsgerecht und schnell ins Unternehmen geholt. 584131