ఎన్నో అంచనాలను ఇంగ్లండ్కు మోసుకెళ్లిన ఇండియా టీమ్ నిరాశ పరిచింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ను ఎగరేసుకుపోయి భారత్కు షాక్ ఇచ్చింది న్యూజిలాండ్ టీమ్.నిన్న రిజర్వ్ డే కావడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో న్యూజీలాండ్ ఏకంగా 8 వికెట్ల తేడాతో టీమ్ ఇండియాను చిత్తు చేసింది. అయితే 8 వికెట్లు అందుబాటులో ఉంచుకుని 32 నర్స్ ఆధిక్యంలో ఉన్న ఇండియా టీమ్ రెండో సెషన్ మధ్యలోనే ఆటను ముగించేసి నిరాశ పరిచింది.
ఇక ఇండియా ఓవర్నైట్ బ్యాట్స్మెన్ పుజారా (15)తో పాటు కోహ్లి (13) తక్కువ స్కోర్లకు పరిమితమయ్యారు. రిషబ్ పంత్ 88 బంతుల్లో 41పరుగులతో ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో 170 పరుగులు చేసిన భారత్ కివీస్కు 139 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ కివీస్ అలవోకగా దీన్ని చేధించింది. ఇక టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్లో 217 రన్స్కే ఆలౌట్ అయింది. ఇక కివీస్ ఇదే ఇన్నింగ్స్లో 249 పరుగులు చేసింది. భారత్ రెండో ఇన్నింగ్స్లో ఇంకో పది ఓవర్ల ఆట ఆడివుండి, ఒక 30రన్స్ చేసినట్టయితే ఓటమి నుంచి బయటపడేది. కానీ అదుంకు భిన్నంగా మధ్యలోనే ఆట ముగించి ఓటమి పాలయింది.
252236 204354IE nonetheless is the market leader and a large element of other folks will miss your great writing because of this problem. 901251
544545 27413Glad to be one of numerous visitants on this awing internet site : D. 529740