భారత్, శ్రీలంకల మద్య జరగాల్సిన వన్డే మరియు టీ20 సిరీస్ లు కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా ప్రారంభం కాబోతున్నాయి అంటూ అధికారిక ప్రకటన వచ్చింది. జులై 13 నుండి ప్రారంభం అవ్వాల్సిన మ్యాచ్ లు కాస్త శ్రీలంక ఆటగాళ్లు అంతా క్వారెంటైన్ లో ఉండటం వల్ల నాలుగు రోజులు ఆలస్యంగా మొదలు పెట్టాలని నిర్ణయించారు. జులై 17వ తారీకున శ్రీలంకలో భారత్ పర్యటన మొదలు అవుతుంది. ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని వచ్చిన శ్రీలంక ఆటగాళ్లు క్వారెంటైన్ లో ఉండటం వల్ల ఇండియాతో సిరీస్ ఆలస్యం అవుతుందని అంటున్నారు.
ఆటగాళ్లు మరియు జట్టు సిబ్బందిలో కొందరికి కరోనా లక్షణాలు ఉన్న కారణంగా క్వారెంటైన్ తర్వాత పరీక్షలు చేసి ఆ తర్వాత సిరీస్ ను మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. జులై 17న వన్డే సిరీస్ మొదలు అయ్యి మూడు వన్డేల సిరీస్ జులై 21న పూర్తి అవుతుంది. ఇక వెంటనే అంటే జులై 24వ తారీకున టీ20 సిరీస్ ప్రారంభం అయ్యి జులై 27వ తేదీన మూడవ చివరి టీ20 మ్యాచ్ జరుగుతుంది. శ్రీలంక పర్యటనకు ఇండియన్ జట్టుకు దావన్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. ఇండియన్ జట్టు ఇప్పటికే ఇంగ్లాండ్ లో ఉండగా జూనియర్ లతో కూడిన జట్టు శ్రీలంకలో మ్యాచ్ లు ఆడబోతుంది.
71673 541908When I initially commented I clicked the -Notify me when new comments are added- checkbox and now each time a remark is added I get four emails with exactly the same comment. Is there any manner you possibly can take away me from that service? Thanks! 548339
181654 42066my English teacher hate me cause i keep writing about somebody from The WANTED called Jay, she gives me evils and low 273231