సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్ ఆదివారం సాయంత్రంతో ముగియనుంది. దేశంలో ఎన్నికలు మొదలై అప్పుడే 40 రోజులు దాటడంతో అందరిలోనూ ఉత్కంఠ రాజ్యమేలుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? తమ రాష్ట్రంలో ఏ పార్టీ గద్దెనెక్కుతుంది? తమ ఎంపీ గెలుస్తాడా? తమ ఎమ్మెల్యేని విజయం వరిస్తుందా? వంటి ప్రశ్నలు అందరి మదినీ తొలిచేస్తున్నాయి. 23వ తారీఖు ఎప్పుడొస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అంతవరకు ఆగలేని వారి కోసం ఆదివారం ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. చాలామంది వీటి కోసం కూడా చాలా ఆతృతగా చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కొంతవరకు స్పష్టత వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఎగ్జిట్ పోల్స్ కచ్చితమైన ఫలితాల్నే వెల్లడిస్తాయా? వాటిని ఎంతవరకు నమ్మొచ్చు? అంటే కచ్చితంగా నమ్మొచ్చని మాత్రం చెప్పలేం.
ఎందుకంటే ఇప్పటివరకు చాలా సంస్థలు తమ తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. అన్నిసార్లూ అవి కచ్చితమైన ఫలితాలను మాత్రం వెల్లడించలేదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే అవి నిజమయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండటం అనేది అవి నిర్వహించిన తీరుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఎన్నికల సర్వేలు ప్రీపోల్ సర్వే, ఎగ్జిట్ పోల్ సర్వే, పోస్ట్ పోల్ సర్వే అని మూడు రకాలుగా ఉంటాయి. ఎన్నికలు జరగడానికి ముందుగా నిర్వహించేవి ప్రీపోల్ సర్వే. వీటిలో నియోజకవర్గానికి నిర్ధారిత శాంపిల్ తీసుకుని వారి అభిప్రాయాలను సేకరించి, అనంతరం శాస్త్రీయ పద్ధతిలో వాటన్నింటినీ క్రోఢీకరించి ఓ అంచనాకు వస్తారు. ఇక పోస్ట్ పోల్ సర్వే అనేది ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరికి ఓటేశారు అనే అంశాన్ని ఆరా తీయడం ద్వారా ఫలితాలు అంచనా వేస్తారు. ఎగ్జిట్ పోల్ అనేది పోలింగ్ జరిగే రోజునే తెలుసుకునే సర్వే. ఓటర్లు పోలింగ్ కేంద్రంలో నుంచి బయటకు వచ్చే సమయంలో వారు ఎవరికి ఓటేశారనే విషయాన్ని అడిగి తెలుసుకుంటారు.
ప్రీపోల్, పోస్ట్ పోల్ సర్వేలకంటే ఎగ్జిట్ పోల్ సర్వేకే కాస్త విలువ ఎక్కువ. అయితే, ఇటీవల కాలంలో ఓటరు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. తాను ఏ పార్టీకి ఓటేశాననే విషయం కచ్చితంగా చెప్పడంలేదు. అడిగిన వ్యక్తిని బట్టి అతడి సమాధానం ఉంటుంది. అంటే.. అధికార పక్షానికి చెందిన వ్యక్తులు అడిగితే, అధికార పార్టీకే ఓటేశానని, ప్రతిపక్ష పార్టీవాళ్లు అడిగితే వారికే వేశానని చెప్పడం ద్వారా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఇలాంటి సర్వేలు నిజం కావడం అనేది చాలా అరుదుగా జరుగుతోంది. 2004 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చాలా సర్వేలు వెల్లడించాయి. కానీ యూపీఏ అధికారంలోకి వచ్చింది. 2009లో యూపీఏకి వచ్చే సీట్ల సంఖ్యను సరిగా అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ, ఆ కూటమికి వచ్చే సీట్లను కచ్చితంగా చెప్పలేకపోయాయి.
ఇక ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ తమ ఫలితాలు వెల్లడించాయి. వాటిలో ఎక్కువ సంస్థలు టీఆర్ఎస్ కే అనుకూలంగా తమ ఫలితాలు చెప్పినప్పటికీ, ఆ పార్టీకి వచ్చే సీట్లను మాత్రం సరిగా అంచనా వేయలేకపోయాయి. ఒక్క ఇండియాటుడే సర్వే తప్ప మిగిలిన సంస్థలన్నీ 50 నుంచి 65 సీట్లు మాత్రమే టీఆర్ఎస్ కు వస్తాయని పేర్కొన్నాయి. అంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి ఒక అంచనాకు రావడం వీలువుతుంది కానీ, అవి వంద శాతం నిజమవుతాయనే మాత్రం అనుకోనవసరం లేదు. తాజాగా తన ఫలితాలను వెల్లడించిన సందర్భంగా విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా ఇదే విషయం చెప్పారు. అంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆధారంగా చేసుకుని బెట్టింగులు మాత్రం కట్టి నష్టపోవద్దని పలువురు హెచ్చరిస్తున్నారు.
382218 294761But wanna say that this really is really helpful , Thanks for taking your time to write this. 953926
124200 820091The posh distributed could be described as distinctive; customers are really yearning for bags is a Native aspirations. Which strange surroundings is built that is to market diversity furthermore importance with travel and leisure market trends. hotels particular offers 34570
344647 243773Billiard is a game which is mostly played by the high class people 778879