ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై బీజేపీ నాయకురాలు, సినీ నటి మాధవీలత ఫైర్ అయ్యారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి హిందూ దేవుళ్ల విగ్రహాల ధ్వంసం జరుగుతోందని అన్నారు. ఇంత జరుగుతున్నా జగన్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని మండిపడ్డారు.
నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 122 ఆలయాల్లో దాడులు జరిగడం బాదిస్తోందని అన్నారు. కేవలం హిందూ దేవాలయాలపైనే దాడులు జరగడం ఏమిటో అర్ధంకావడం లేదని అన్నారు.
మతిస్థిమితం లేని వారి పని అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఆ మతిస్థిమితం లేనివారికి ఇతర మతాలు కనపడటం లేదా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవాలయాలపై దాడులు కరోనాలా కొత్త జబ్బా.. అంటూ ఎద్దేవా చేశారు. హిందూ ధర్మం లేకుండా చేయాలనే కొందరి కుట్ర అని అన్నారు. ‘హిందువులూ మేల్కోండి. ఎంత గళమెత్తితే అంతగా ఈ ఉద్యమం ముందుకు వెళుతుంది. సోషల్ మీడియా ఎంతో మంది దిగి వచ్చేలా చేసింది’ అన్నారు.
920509 518975There is noticeably big cash to realize about this. I suppose you created certain nice points in capabilities also. 334880