Guntur Kaaram: సినిమాలకు సంక్రాంతి సీజన్ ఎప్పుడూ పండగే. సంక్రాంతికి ఆసక్తి రేపుతున్న సినిమాల్లో మహేశ్ (Mahesh) హీరోగా త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ఒకటి. అతడు, ఖలేజా తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. మహేశ్ ఫ్యాన్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే.. సినిమాపై వస్తున్న వార్తలు కొంత గందరగోళ పరిస్థితులు కల్పిస్తున్నాయి. గతంలో పలువురు ప్రాజెక్టు నుంచి వాకౌట్ కావడం.. ఇటివలే సెకండ్ సింగిల్ పై అభిమానులే విమర్శలు చేయడం.. పాటల రచయిత, నిర్మాత అసహనం వ్యక్తం చేయడం వార్తల్లో నిలిచాయి. సంగీత దర్శకుడు థమన్ పై కూడా విమర్శలు రావడం గమనార్హం.
ఇప్పుడీ సినిమా గురంచి మరో న్యూస్ వైరల్ అవుతోంది. విడుదల తేదీ సమీపిస్తున్నా ఇంకా షూటింగ్ పూర్తికాకపోవడం.. 18రోజులు రీషూట్ జరిగిందనే వార్తలు వస్తున్నాయి. ఔట్ పుట్ నూ ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదనే రీషూట్ కి వెళ్లారని సమాచారం. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.