కశ్మీర్ లోయలో జరిగిన ఘోరాలకు, అశాంతికి పాకిస్థాన్, ఉగ్రవాదులు కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులామ్ నబీ ఆజాద్ అన్నారు. కశ్మీర్ పండిట్లకు ఎదురైన అనుభవాలతో ఇటివల తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను పరోక్షంగా ప్రస్తావించారు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజల్లో చీలికలు తెచ్చేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తూంటాయి.. ఇందుకు కాంగ్రెస్ మినహాయింపేమీ కాదన్నారు. ఈ విషయంలో తాను ఏ ఒక్క రాజకీయ పార్టీని క్షమించనని అన్నారు. సమాజం, పౌరులు ఐక్యంగా ఉండాలి. కుల, మతాలకు అతీతంగా అందరికీ న్యాయం జరగాలి. అప్పుడే దేశం బాగుంటుంది. కశ్మీర్ లో నాడు జరిగిన పరిస్థితులకు పాకిస్థాన్ ఉగ్రవాదమే కారణమని అన్నారు.
మరోవైపు ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ సినిమాను అందరూ చూడాలని దేశ ప్రధాని మోదీ సైతం పిలుపునిచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది.
750300 7960Id must consult you here. Which is not some thing Its my job to do! I spend time reading an post that may possibly get people to think. Also, several thanks for permitting me to comment! 651000
700110 732778You appear to be very professional within the way you write.::~ 729623