బస్సుల్లో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణం: మంచీ, చెడూ.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,702FansLike
57,764FollowersFollow

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ మహిళలకు తీపి కబురు అందించింది. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి (డిసెంబర్ 9), తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు.. అందరూ ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ట్రాన్స్‌జెండర్లకు సైతం ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా పల్లె వెలుగు మొదలుకుని ఎక్స్‌ప్రెస్ బస్సుల వరకు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల వరకు.. అన్నిట్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణమే. అంటే, ఇకపై ఎవరూ బస్ టిక్కెట్ కొనుగోలు చేయాల్సిన పనిలేదు.

నిజానికి, మహిళల కోణంలో చూస్తే, ఇది చాలా చాలా మంచి నిర్ణయమే. కానీ, ఆర్టీసీ సంస్థ కోణంలో చూస్తే, గుది బండ.. అని చెప్పక తప్పదు. జీరో టిక్కెటింగ్ పద్ధతి తీసుకొచ్చి, ఆర్టీసీకి ప్రభుత్వం నిధుల్ని సమకూర్చుతుందట. నిజమేనా.? ఈ పథకం ద్వారా ఏర్పడే లోటుని, ప్రభుత్వం భర్తీ చేస్తుందా.? అన్నది ముందు ముందు తేలుతుంది.

తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ తరహా పథకం అమల్లో వుంది. చెన్నయ్ సిటీలో అయితే, ఏ రాష్ట్ర మహిళ.. అని చూడరు. మహిళలందరికీ ఉచిత ప్రయాణమే.! తెలంగాణ రాష్ట్ర మహిళ.. అని ప్రూవ్ చేసుకోవడానికి, గుర్తింపు కార్డులు తప్పనిసరి అట. ముందు ముందు స్మార్ట్ కార్డుల్ని తెచ్చే యోచన ఆర్టీసీ చేస్తోందట కూడా.

వాస్తవానికి, ఆర్టీసీ పీకల్లోతు నష్టాల్లో వుంది. గతంలో ఆర్టీసీ సిబ్బంది ఆందోళనలు చేశారు, ధర్నాలు చేశారు.. చాలా చాలానే చేశారు. బంద్ కూడా జరిగింది. బస్సుల బంద్‌తో సంస్థ మరింత నష్టపోయింది. ఉద్యోగులూ నష్టపోయారు. ఆ నష్టాల నుంచి ఆర్టీసీ ఇంకా బయటకు రాలేదు.

మహిళలకేనా.? మగాళ్ళు ఏం పాపం చేశారని.? అన్న చర్చ కూడా తెరపైకొస్తోంది. మగాళ్ళ ఆవేదన ఇది.! ఇకనేం, మొత్తం అందరికీ ఉచితం చేసేస్తే పోలా.? అన్న వాదనా లేకపోలేదు. ఎవరి గోల వారిది.! ఒక్కటి మాత్రం నిజం. ప్రతి ఉచిత సంక్షేమ పథకం ప్రజల నెత్తిన మోయలేనంత ఆర్థిక భారాన్ని మోపుతుంది.! ఆ భారం సంగతి ముందు ముందు అనుభవమవుతుంది జనాలకి

సినిమా

ఇంకా ఏం అనుకోలేదు… టైటిల్‌తోనే హైప్

ఈటీవీ విన్‌తో కలిసి గతంలో పలు విజయవంతమైన ప్రాజెక్టులను అందించిన నిర్మాత వంశీ నందిపాటి మరోసారి అదే ప్లాట్‌ఫారమ్‌తో చేతులు కలిపి కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు....

Sushmita Konidela: నాడు గారాలపట్టి.. నేడు “మెగా” నిర్మాత

Sushmita Konidela: తండ్రికి పుత్రుడు జన్మించిన పుత్రోత్సాహము అనేది నానుడి. అయితే.. తండ్రికి పుత్రిక జన్మించినను అంతకుమించి పుత్రికోత్సాహమే.. అని నిరూపించారు కొణిదెల సుస్మిత. మెగాస్టార్...

పవన్ కోసం 6 గంటలు వెయిట్ చేసిన దర్శకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా మంది దర్శకులు కలలు కంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న క్రేజ్...

ఆన్‌లైన్ దూషణలపై లావణ్య త్రిపాఠి ఫిర్యాదు

సోషల్ మీడియాలో తనపై మరియు తన కుటుంబ సభ్యులపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది....

Sara Arjun: ధురంధర్ బ్యూటీపై ట్రోలింగ్..! సారా అర్జున్ చేసిందిదే..

Sara Arjun: దురంధర్ సినిమా దేశాన్ని షేక్ చేస్తే.. సినిమాలో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ తన అందంతో యువత హృదయాలను కొల్లగొట్టింది. దీంతో...

రాజకీయం

రాజేంద్రప్రసాద్‌కు కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం

హైదరాబాద్‌లో భారత కల్చరల్ అకాడమి, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌కు కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం అందజేశారు. ప్రముఖ...

తిరుమల లడ్డూ వివాదం… వైసీపీపై తీవ్ర విమర్శలు

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చకు దారితీసింది. ఈ అంశంపై వైసీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం వంటి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత...

తిరుమల లడ్డూ వివాదంపై హిందూ ధర్మ ఆచార్య సభ ఆందోళన

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో హిందూ ధర్మ ఆచార్య సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి...

పెనుమూలిలో కొత్త లైబ్రరీ భవనం ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి మరో అడుగు పడింది. దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో పునర్ నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో...

నులకపేటలో కొత్త కమ్యూనిటీ హాల్ ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించిన ఈ...

ఎక్కువ చదివినవి

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా అనుకున్న తేదీ కంటే ముందుగానే ఈ...

ఏపీ విద్యకు కొత్త దిశ: ప్రపంచానికి ఆంధ్ర మోడల్ చూపుదాం – లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగాన్ని బలోపేతం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా “ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్”ను నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...

Daily Horoscope: మేష, తుల రాశుల వారికి ఉద్యోగ పురోగతి సూచనలు – ధనుస్సు రాశికి ప్రయాణ యోగం

మార్చి 5, 2026 గురువారం రాశిఫలాలు: మేషం (Aries): ఈరోజు పనుల్లో మీ చురుకుదనం కనిపిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది. అధికారులు మీ పనిని ప్రశంసించే అవకాశం ఉంది. ఆర్థిక...

పోలవరం పనులు ఎలా వెనక్కి వెళ్లాయి? కాగ్ నివేదికలో కీలక అంశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్ట్ పనులు గత కొన్ని సంవత్సరాల్లో ఎలా ఆలస్యానికి గురయ్యాయన్న అంశం మళ్లీ చర్చకు వచ్చింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో ప్రాజెక్ట్...

“భారత్ నాలెడ్జ్ ఎకానమీకి నాయకత్వం వహిస్తోంది” : రైసినా డైలాగ్‌లో చంద్రబాబు

ఢిల్లీ వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్–2026 సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 2016 నుంచి కొనసాగుతున్న ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సులో తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం...