గ్రేటర్ ఎన్నికల సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి నిరసన సెగ తగులుతోంది. ఇప్పటికే వరద సాయం అందని వారి నిరసనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు రోడ్లు ఎందుకు వేయడం లేదని ప్రజల ప్రశ్నిస్తూండటంతో తలలు పట్టుకుంటున్నారు. ఓట్లు అడిగేందుకు వెళ్లి ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తిప్పలు పడుతున్నారు. మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు ఎదురైన పరిస్థితే ఇందుకు ఉదాహరణ.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన స్థానిక యాప్రాల్ ప్రాంతంలో పర్యటించారు. దీంతో స్థానిక ప్రజలు ఆయన్ను చుట్టుముట్టారు. రోడ్లు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. తాము జీహెచ్ఎంసీకి టాక్సులు కడుతున్నా రోడ్లు ఎందుకు వేయరని ప్రశ్నించారు. ఓట్లు అడిగేముందు ఈ ప్రాంతంలో రోడ్లు చూడాలని పట్టుబట్టారు. దీంతో తన నిధులతో ఎన్నికలయ్యాక రోడ్లు వేయిస్తానని ప్రజలతో అన్నారు. దీనికి కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. గతంలో కూడా ఇవే హామీలు ఇచ్చారని ఏ ఒక్కటీ నెరవేర్చడం లేదని మండిపడ్డారు.
దీంతో ఎన్నికలయ్యాక సొంత నిధులతో రోడ్లు వేయిస్తానంటూ తన లెటర్ ప్యాడ్పై సంతకం చేసి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మీరు ఎమ్మెల్యేగా గెలిపించారు.. మీకు పనులు చేయడం నా విధి చేస్తానని హామీ ఇచ్చారు. మైనంపల్లి పర్యటన నేపథ్యంలో ‘నో రోడ్స్.. నో ఓట్స్’, ‘రోడ్డు వేయండి.. ఓటు అడగండి’ అనే ప్లకార్డులను స్థానికులు ప్రదర్శించారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర ప్రజలు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే పర్యటన మొత్తం కూడా ప్రజలు ఆయన ముందు ఈ ప్లకార్డులతోనే నిరసన తెలిపారు.
505664 339164Cause thats required valuable affiliate business rules to get you started on participating in circumstances appropriate for your incredible web-based business concern. Inernet marketing 433042
108334 289409Respect to internet site author , some wonderful entropy. 8500