దేశంలో మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా వారి అఘాయిత్యాలు ఆగడం లేదు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన మరో దారుణమైన ఘటనే ఇందుకు ఉదాహరణ. దైవ దర్శనానికి వెళ్లిన ఓ మహిళపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా ఆమె పక్కటెముకలు, కాళ్లు విరగొట్టి పాశవిక దాడికి తెగబడ్డారు. స్థానిక బదాయూ జిల్లాలో అంగన్ వాడీ కార్యకర్తగా పని చేస్తున్న 50 ఏళ్ల మహిళపై జరిగిన ఈ దారుణం జనవరి 3వ తేదీ రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జిల్లాలోని ఉగైతీ ప్రాంతంలో 3వ తేదీ సాయంత్రం ఆలయానికి వెళ్లిన ఆమె ఎంతకీ ఇంటికి రాలేదు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆలయ పూజారి, మరో ఇద్దరు అర్ధరాత్రి ఆమె ఇంటికి చేర్చారు. బావిలో పడిపోతే తాము రక్షించి తీసుకొచ్చామని చెప్పారని ఆమె కుమారుడు తెలిపాడు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. ఈ విచారణ, పోస్టుమార్టంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.
మహిళ బావిలో పడిపోవడం కాదని.. ఆమె సామూహిక అత్యాచారానికి గురైందని తెలిసింది. నిందితులు ఆమెపై పాశవిక దాడికి సైతం పాల్పడ్డారని తేలింది. సామూహిక అత్యాచారం అనంతరం ఆమెపై దాడి చేసినట్టు తేలింది. మహిళ పక్కటెముకలు, కాళ్లు విరగొట్టి, ఊపిరితిత్తుల్లో బలమైన వస్తువుతో గాయం చేసినట్టు పోస్టుమార్టంలో తేలింది. దీంతోపాటు ఆమె అవయువాలపై కూడా గాయం చేసినట్టు పరీక్షల్లో తేలింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
132957 635262Possible call for all types of led tourdates with some other fancy car applications. A lot of also give historic packs and other requires to order take into your lending center, and for a holiday in upstate New York. ??? 942541
651283 78357Read More HERE. I bookmarked it. 69979