Switch to English

గాంధీలో పరిస్థితి అంత ఘోరంగా ఉందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘కరోనా విషయంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎంతమందికైనా చికిత్స చేసే సామర్థ్యం ప్రభుత్వాస్పత్రులకు ఉంది. గాంధీ ఆస్పత్రిలో బెడ్లు లేక రోగులు కిక్కిరిసోతున్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. 2వేల మందికి చికిత్స చేసే సామర్థ్యం కలిగిన గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్నది 247 మంది మాత్రమే’ – ఇవీ సీఎం కేసీఆర్ సోమవారం చేసిన వ్యాఖ్యలు. కరోనా విషయంలో అంతా తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ హైకోర్టు మండిపడిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు.

నిజానికి క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? కేసీఆర్ చెప్పినట్టుగానే ఉందా? అంటే కాదనే వ్యాఖ్యలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో.. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజూ భారీగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారమే ప్రస్తుతం 2,030 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ లో గాంధీతోపాటు ఛాతీ ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రిలోనే కరోనా చికిత్స జరుగుతోంది. ఈ మూడింటిలో కూడా గాంధీ ఆస్పత్రిలోనే ఎక్కువ మంది బాధితులున్నారు. కానీ సీఎం మాత్రం 247 మంది మాత్రమే ఉన్నారని చెప్పడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పైగా సీఎం ఈ వ్యాఖ్యలు చేసిన సోమవారంనాడే గాంధీ ఆస్పత్రి నుంచి 50 ఏళ్ల లోపు వయసున్న 393 మందిని డిశ్చార్జి చేశారు. వీరిలో 310 ఇంట్లో క్వారంటైన్ కాగా, 83 మంది ప్రకృతి చికిత్సాలయానికి తరలించారు. వారికి కరోనా తగ్గకపోయినా.. బెడ్ల కొరత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే, ఐసీఎంఆర్ తాజా మార్గదర్శకాల ప్రకారమే వారిని డిశ్చార్జి చేసినట్టు గాంధీ వైద్యాధికారులు వెల్లడించారు.

ఈ సంగతి అలా ఉంచితే.. గాంధీ ఆస్పత్రిలో పరిస్థితి దారుణంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గాంధీకి వెళ్లడం అంటే శ్మశానానికి వెళ్లడమే అంటూ ఇటీవల చనిపోయిన జర్నలిస్టు మనోజ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మనోజ్ ను సరిగా పట్టించుకోవడంలేదని, అందుకే ఆయన ప్రాణాలు కోల్పోయారని విమర్శలు వచ్చాయి.

తాజాగా ఓ ఛానల్ కు చెందిన కెమెరామెన్ గాంధీలో పరిస్థితిని ఏకరువు పెట్టాడు. కరోనా సోకిన సదరు కెమెరామెన్ ను చికిత్స నిమిత్తం గాంధీకి తరలించారు. అయితే, మీ బెడ్లు ఇవి అని చూపించిన తర్వాత ఏ ఒక్కరూ తమను పట్టించుకోలేదని, కనీసం ఆహారం కూడా ఇవ్వలేదని వాపోయాడు. మంచినీళ్లు అడిగినా ఇచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నాడు. ఒకరోజు గడిచినా డాక్టర్లు కూడా రాలేదని తెలిపాడు. నిన్న రాత్రి నుంచి ఆహారం తినలేదని చెప్పినా.. ఓకే ఓకే అంటున్నారు తప్ప ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. దీనికి సంబంధించి అతడు మాట్లాడిన ఫోన్ సంభాషణ బయటకు రావడంతో గాంధీలో పరిస్థితి ఎలా ఉందో తెలిసింది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...