రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి గత పది పదిహేను ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. అప్పుడెప్పుడో రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కాని ఆ సమయంలో జయలలిత మరియు కరుణానిధిలు తమిళనాడును ఏళేస్తున్నారు. ఆ సమయంలో మరెవ్వరికి అవకాశం కలిగించలేదు.
ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా అధికారం మార్చి మార్చి దక్కించుకున్నారు. అదే సమయంలో రజినీకాంత్ ను ఆ రెండు పార్టీలు చేరువ చేసుకునేందుకు ప్రయత్నించాయి. రజినీకాంత్ మాత్రం ఎప్పుడు పూర్తి స్థాయిలో ఏ ఒక్క పార్టీకి మద్దు ఇవ్వలేదు. సొంతంగా పార్టీని పెడుతాడు అంటూ ప్రచారం అయితే జోరుగా సాగింది.
కొన్ని నెలల క్రితం రజినీకాంత్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రకటించాడు. 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రకటించాడు. రాజకీయ ఉద్దండులు అయిన జయలలిత మరియు కరుణానిధి ఇద్దరు కూడా మృతి చెందడటంతో తమిళనాట ప్రస్తుతం రాజకీయ శూన్యత కొంత మేరకు ఉంది. కనుక ఈ సమయంలో రజినీకాంత్ రాజకీయ ఎంట్రీ ఖచ్చితంగా ఆయనకు మేలు కలిగిస్తుంది.
ప్రజలకు కూడా మార్పును ఇస్తుందని అంతా ఆశించారు. రజినీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడు పార్టీ ప్రకటన ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రజినీకాంత్ కరోనాకు భయపడి ఈసారి పార్టీ పెట్టే ఉద్దేశ్యం ను విరమించుకున్నాడు అంటూ ఒక పత్రిక ప్రకటన వచ్చింది. అది తాను విడుదల చేసింది కాదని అందులో కొన్ని నిజాలు కొన్ని అబద్దాలు ఉన్నాయి అంటూ స్వయంగా రజినీకాంత్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు.
రాజకీయ పార్టీ విషయమై చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటాను అంటూ రజినీకాంత్ చెప్పడంతో మళ్లీ ఆయన పార్టీ పెట్టేందుకు వెనుకంజ వేస్తున్నాడేమో అనిపిస్తుంది. దాంతో అభిమానులు ఆయనపై పార్టీ పెట్టాల్సిందే అంటూ ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పోయేస్ గార్డెన్ ఇంటి ముందు భారీ ఎత్తున అభిమానులు చేరుకుని దర్నాలు చేస్తూ పార్టీని పెట్టాల్సిందే అంటూ దీక్షలు చేస్తున్నారు. నవంబర్ లో తన అభిమాన సంఘం మక్కన్ మన్రాలు సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా పేర్కొన్నారు.
850236 953296I observe there is lots of spam on this weblog. Do you want assist cleaning them up? I may well aid among classes! 848483